ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరో గా దూసుకుపోతున్నాడు నితిన్. జయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన నితిన్ ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ఇక జయం సినిమా తర్వాత దిల్ అనే సినిమాతో యువతలో బాగా క్రేజ్ సంపాదించాడు నితిన్ . ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్న నితిన్  ఏకంగా దర్శక ధీరుడు రాజమౌళి కంట్లో  పడ్డాడు. దీంతో దర్శక ధీరుడు రాజమౌళి సై అనే సినిమాను నితిన్ హీరోగా తెరకెక్కించగా  అది బ్లాక్బస్టర్ హిట్ గా  నిలిచి ఎన్నో వసూళ్లను రాబట్టి నితిన్ కు ఎంతో క్రేజ్ తెచ్చి పెట్టింది. దీంతో తెలుగు ప్రేక్షకులు అందరి దృష్టిని ఆకర్షించాడు. 

 

 

 ఇక ఆ తర్వాత ఏకంగా  ఆరుపలకల దేహంతో కూడా అభిమానులను ఎంతగానో అలరించాడు. ఇలా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే  సినిమాలు ఎక్కువగా నటిస్తూ ఉంటారు నితిన్. ఇక తాజాగా భీష్మ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో  రష్మిక మందన తో రొమాన్స్ చేసిన నితిన్ తన దైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు అనే చెప్పాలి. హీరోలు కేవలం సినిమాలు చేయడమే కాదు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును వేరే సైడ్ బిజినెస్ ల పైకి ఇన్వెస్ట్ చేస్తూ మరో వైపు నుంచి కూడా సంపాదిస్తూ ఉంటారు. 

 

 

 ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలకు ఓ వైపు సినిమాల్లో దూసుకుపోతునే  మరోవైపు సైడ్ బిజినెస్ లలో  కూడా తమ సత్తా చాటుతున్నారు. నితిన్ కూడా ఒక మంచి బిజినెస్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే.. రెస్టారెంట్ నడుపుతున్నాడు నితిన్. హైదరాబాదులో టి గ్రిల్స్ అనే ఓ రెస్టారెంట్లో నడుపుతున్నాడు నితిన్. ఓవైపు సినిమాల నుంచే కాదు మరోవైపు ఇలా రెస్టారెంట్ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే చాలా మంది సినీ ప్రేక్షకులకు సైడ్ బిజినెస్ గురించి తెలియదు. అందుకే నితిన్ రెస్టారెంట్ బిజినెస్ గురించి తిలియగానే  చాలామంది ప్రేక్షకులు శాఖవుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: