బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక ఇప్పుడు అతను పాన్ ఇండియా హీరో గా బాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్నాడు అనేది వాస్తవం. బాహుబ‌లి సినిమా ప్ర‌భాస్ క్రేజ్‌ను ఎల్ల‌లు దాటించేసింది. ఇక సాహో ప్లాప్ అయినా ఆ సినిమాకు బాలీవుడ్‌లో వ‌చ్చిన వ‌సూళ్లు చూసి అంద‌రూ కుళ్లుకున్నారు. ఒక డిజాస్ట‌ర్ సినిమాకు ఏకంగా రు. 150 కోట్లు ఏంట్రా బాబు అని త‌ల‌లు ప‌ట్టుకున్నారు అక్క‌డి వాళ్లు.

 

టాలీవుడ్ లో ఇప్పుడు అతని హవా ఎక్కువగా నడుస్తుంది అనేది వాస్తవం. టాలీవుడ్ లో అతనికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్ తో కలిసి ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఆమె హీరోయిన్ గా కాదు. ఆమె నిర్మాతగా... అలాగే ప్రభాస్ కూడా నిర్మాతగా... అంతే కాదు ఆ సినిమా స్టోరీ కూడా అతనే ఇచ్చాడని అంటున్నారు. ఆ స్టోరీ విన్న హీరోయిన్ ఈ సినిమాను ఓకే చేసింది. 

 

ఇక్కడ వరకు బాగానే ఉంది గాని... ఆ హీరోయిన్ తో బాబు డేట్ లో ఉన్నాడని ఆ క్రమంలోనే ఈ సినిమాను ఓకే చేసారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఒక కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని సమాచారం. ప్రభాస్ తో పాటుగా సదరు హీరోయిన్ ఒక ఛారిటి ట్రస్ట్ ని నిర్వహిస్తారని... ఆ కోణం లో ఈ కథ ఉంటుంది అని సమాచారం. దీనిపై త్వరలో ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. వీళ్ళు డేట్ లో ఉన్న వార్తే ఇప్పుడు హైలెట్ అవుతోంది. మ‌రి ఈ వార్తల్లో నిజానిజాలు ఏంటో వారికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: