తెలుగు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో ఎంట్రీ ఎంతో గ్రాండ్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి సినిమాలోనూ ఎంతో కొత్తగా హీరోలు తమ ఎంట్రీ  ప్లాన్ చేస్తూ ఉంటారు. దర్శకనిర్మాతలు కూడా హీరోల ఎంట్రీని ఎంతో అద్భుతంగా ఉండేలా అభిమానులను ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా హీరోల ఎంట్రీ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ ఎంట్రీ సన్నివేశాన్ని ఎన్నిసార్లు చూసినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులు మైమరిచి పోతుంటారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఇప్పటి వరకు రామ్ చరణ్ చాలానే సినిమాల్లో  నటించిన విషయం తెలిసిందే. కానీ రామ్ చరణ్ కెరియర్ లో మగధీర సినిమా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. 

 


 రామ్ చరణ్ ని ఒక్కసారిగా స్టార్ హీరోని చేసింది ఈ సినిమా. మెగా పవర్ స్టార్ అనే స్టార్ డమ్  తెచ్చిపెట్టింది మగధీర సినిమా. అప్పుడప్పుడే  తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన రామ్ చరణ్ కు.. తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేదు అని నిరూపించింది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో రామ్ చరణ్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించగా శ్రీహరి ముఖ్య పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలో ప్రేక్షకులకు గుర్తుండిపోయే సన్నివేశం.. రామ్ చరణ్ ఎంట్రీ. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. 

 

 శత్రువుని చెండాడే ధీరుడు... శతదృవంశ యోధుడు అంటూ ఒక పవర్ ఫుల్ డైలాగ్ చెబుతూ ఉంటే... రామ్ చరణ్ నీటి ప్రవాహం లోంచి గుర్రపు స్వారీ చేస్తూ ఎంట్రీ  ఇస్తాడు. ఈ సన్నివేశం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు అనే చెప్పాలి. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినప్పటికీ రామ్ చరణ్ ఎంట్రీ మాత్రం ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సన్నివేశం తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది అని చెప్పాలి. ఇలా ఎంతో పవర్ ఫుల్ గా  రామ్ చరణ్ ఎంట్రీతో  తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు,

మరింత సమాచారం తెలుసుకోండి: