సాధారణంగా హీరోయిన్లు అవసరాన్ని బట్టి, అవకాశాల్ని బట్టి తమ అవతారాన్ని మార్చేస్తుంటారు. అలా మారడానికి వారికుండాల్సిన కారణాలు వారికున్నాయి. క్లారిటీగా చెప్పాలంటే.. అలా చేస్తేనే నాలుగు కాలాల పాటు చిత్రపరిశ్రమలో మనగలుగుతారు. ఇక ఎప్పుడైతే ఆకృతికీ, అందానికి ప్రాధాన్యత పెరిగిందో అప్పటినుంచీ హీరోయిన్లు కూడా ఎక్స్పోజింగ్ చేయడానికి వెనకడుగు వేయడం లేదు.
అయితే కొందరు హీరోయిన్లు బికినీ వేసి ఎక్స్పోజింగ్ చేస్తూనే.. చీరకట్టులో సాంప్రదాయంగానూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటి వారిలో ప్రియమణి ఒకరు. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్న అందాల భామ ప్రియమణి.. 2003లో `ఎవరే అతగాడు?` సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినా.. ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది.
తర్వాత తమిళంవైపు కొన్నాళ్లు దృష్టి పెట్టి మళ్లీ పెళ్ళైనకొత్తలో.. అంటూ హీరో జగపతి బాబుతో జతకట్టింది. ఈ సినిమాతో ప్రియమణి సుడి తిరిగిపోయింది. ఒకేసారి తెలుగులో మూడు అవకాశాలు వచ్చి చేరాయి. ఇక ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన ప్రియమణి భారీ క్రేజ్ ఏర్పర్చుకుంది.
ఇక అప్పటి వరకూ తెలుగింటి అమ్మాయిలా సంస్కారవంతంగా ఉన్న ప్రియ ద్రోణా సినిమాతో గ్లామర్ డాల్గా అవతారమెత్తింది. మిత్రుడు, ప్రవరాఖ్యుడు, శంభో శివ శంభో, సాధ్యం, గోలీమార్, రగడ, రాజ్, రక్తచరిత్ర.. ఇలా చాలా చిత్రాల్లో నటించి మంచి ప్రశంసలు పొందింది. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. చీరకట్టులో సంప్రదాయంగా ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియమణి.. పలు సిసినిమాల్లో బికినీ వేసి హాట్ హాట్ అందాలతోనూ అభిమానులను సొంతం చేసుకుంది.
ఇక ప్రస్తుతం ఈ బ్యూటి విక్టరీ వెంకటేష్ హీరోగా వస్తోన్న చిత్రం ‘నారప్ప’లో నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లపై సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియమణి సుందరమ్మ అనే డీగ్లామర్ రోల్లో కనిపించనున్నారు.