దాదాపు రెండు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మళ్లీ మొహానికి రంగు పూసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఓ మై ఫ్రెండ్, ఎంసీఏ సినిమాలకు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ రెండేళ్ల తర్వాత తొలిసారిగా నటించడం ప్రారంభించాడు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయిందని సమాచారం. అయితే మొట్టమొదటిగా వకీల్ సాబ్ చిత్రం ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వేణు శ్రీరామ్ కి పనిచేసే అవకాశం లభించింది. కాగా... ఇటీవల అతడు పవన్ కళ్యాణ్ గురించి తన అభిప్రాయాలను ఒక ఇంటర్వ్యూ ద్వారా పంచుకున్నాడు.


మీరు పవన్ కళ్యాణ్ తో కలిసి ఎప్పుడైనా సినిమా తెరకెక్కించాలని కోరుకున్నారా అని ప్రశ్నించినప్పుడు తను మాట్లాడుతూ ఇష్టమైన హీరో తో సినిమా తీయడానికి ఎవరైనా ఇష్టపడతారని చెబుతూ పవన్ కళ్యాణ్ పై తన ఇష్టాన్ని చెప్పకనే చెప్పాడు వేణు శ్రీరామ్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి సినిమాని వేణు శ్రీరామ్ 24 సార్లు చూశాడట. గబ్బర్ సింగ్ సినిమాని 23 సార్లు చూశానని... అంత ఇష్టం ఉన్న హీరోతో తాను ఇప్పుడు కలిసి సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పుకొచ్చాడు.


రీమేక్ చిత్రం కాకుండా సొంతంగా రాసుకున్న స్ట్రెయిట్ సినిమాని పవన్ కళ్యాణ్ తో కలిసి చేయాలని ఉందా అని ప్రశ్నించినప్పుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ... పింక్ సినిమా పవన్ కళ్యాణ్ కి తగిన సినిమా. సమాజానికి చెప్పాల్సిన కథ ఈ సినిమాలో ఉంది. ఇటువంటి సినిమాకి దర్శకత్వం వహిస్తున్న అందుకు నేను గర్వంగా ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకానొక రోజు పింక్ రీమేక్ చిత్రం గురించి మాట్లాడుతున్నప్పుడు తాను విన్నానని కానీ ఆ సినిమా తెరకెక్కించే అవకాశం తనకు దక్కుతుందని ఊహించలేదని తాను చెప్పుకొచ్చాడు. రెండు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చే పవన్ కళ్యాణ్ సినిమాని ఎలా తీర్చిదిద్దుతున్నారు అని ప్రశ్నించినప్పుడు ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో మంచి కథ ఉందని ఆ కథలోనే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నామని తాను చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: