మెగా హీరోల్లో సాయి ధరమ్ తేజ్ కి ప్రత్యక పేరు ఉంటుంది.. రేయ్ సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.. కానీ ఆమధ్య వరుసగా 9 ఫ్లాప్ సినిమాలు చేసి చాలా డిప్రెషన్ కి గురయ్యాడు.. ఇటీవలే చిత్ర లహరి హిట్ తో మళ్ళీ రేస్ లో కి వచ్చేశాడు.. అప్పటివరకు సాయి ధరం తేజ్ చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇక తేజ్ కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నారు.. కానీ ఫెయిల్యూర్, సక్సెస్ కాన్సెప్ట్ తో సినిమా చేసి ప్రేక్షకులను బాగానే మెప్పించారు.. ఇక ఆ సినిమా తర్వాత మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజు పండగే సినిమా క్లీన్ హిట్ సాధించి సాయి ధరం ను మళ్ళీ టాప్ చైర్ లో కూర్చో బెట్టింది..

వరుసగా రెండు హిట్లు సాధించిన జోష్ లో సాయి ధరం తేజ్ ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్' అనే వెరైటీ సినిమా చేస్తున్నారు..  తమన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ కాగ వీరి కాంబో లో వచ్చిన అన్ని చిత్రాలు మ్యుజికల్ గా  హిట్ అయ్యాయి అని చెప్పొచ్చు.. అందుకే సాయి ధరం తేజ్ అవసరమైతే తప్పా సంగీత దర్శకుడిని మార్చడు.. ఇక సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వార పరిచయమవుతున్నారు.. ఇప్పటికే రిలీజ్ అయినా పాటలు, టీజర్, ట్రైలర్ కి మంచి పేరు రాగ తేజు కి మరో హిట్ గ్యారెంటీ అంటున్నారు..

ఇదిలా ఉంటే తనకు రేయ్ విషయంలో జరిగినట్లే తమ్ముడు వైష్ణవ్ చేస్తున్న ఉప్పెన సినిమా విషయంలో నూ జరగనున్నట్లు తెలుస్తుంది.. స్టార్ డైరెక్టర్‌గా ఉన్న వైవీఎస్ చౌదరిని నమ్మి రంగంలోకి దిగితే ‘రేయ్’ సినిమా మొదలయ్యాక.. పూర్తి కావడానికి, విడుదల కావడానికి దాదాపు నాలుగేళ్లు పట్టేసింది. ఈ సినిమా సంగతి ఎటూ తేలక తేజు ఎంత ఆవేదన చెంది ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడు తేజు తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్‌ను కూడా తొలి సినిమా గండం వెంటాడుతుండటం గమనార్హం.ఉప్పెన ఓటీటీ రిలీజ్ కోసం కొన్ని ఆఫర్లు వచ్చినా అరంగేట్ర హీరో సినిమాను అలా రిలీజ్ చేస్తే బాగోదని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ఆగుతున్నారు. ఈలోపు వైష్ణవ్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న రెండో సినిమా రిలీజ్ అయిన ఆశ్చర్యపోనవసరం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: