త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. వెండితెర తో పాటు ఇటు టెలివిజన్ తెరపై కూడా మంచి రేటింగ్స్ తో ఇప్పటికి కూడా మంచి క్రేజ్ తో కొనసాగుతోంది అతడు సినిమా. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన ఖలేజ సినిమాలో మహేష్ బాబు ఒక టాక్సీ డ్రైవర్ పాత్ర పోషించగా అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది. అలానే మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందించడం జరిగింది. అయితే మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పేయిల్ అవ్వడం, అలానే అప్పటి నుండి ఇప్పటి వరకు మరొకసారి మహేష్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో మరొక సినిమా రానేలేదు. ఇకపోతే అతి త్వరలో తామిద్దరం కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు ఇటీవల మహేష్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలో తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో చేయనున్న త్రివిక్రమ్, ఆ సినిమాకి అయినను పోయిరావలె హస్తినకు అనేటువంటి టైటిల్ ని ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారని అలానే తదుపరి మహేష్ తో చేయనున్న సినిమాకు సంబంధించి కూడా అ అనే అక్షరం తోనే టైటిల్ ని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాతో పాటు మహేష్ బాబు సినిమాకు సంబంధించి కూడా పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసిన త్రివిక్రం వీలైనంత త్వరగా ఈ రెండు సినిమాలను పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి