టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తానికి రెండున్నరేళ్ల తర్వాత తన అభిమానుల కోరిక మేరకు ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి వకీల్ సాబ్ కాగా మరొకటి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా. ఇప్పటికే వకీల్ సాబ్ చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుని అతి త్వరలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. మరోవైపు క్రిష్ సినిమా రెండు భారీ షెడ్యూల్స్ అనంతరం అతి త్వరలో లేటెస్ట్ షెడ్యూల్ ని జరుపుకోనుంది. వకీల్ సాబ్ లో లాయర్ గా నటిస్తున్న పవన్, క్రిష్ సినిమాలో ఒక వజ్రాల దొంగ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ ని దిల్ రాజు, బోనీ కపూర్ కలిస్ నిర్మిస్తుండగా, క్రిష్ సినిమా ని ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.
ఇక ఈ రెండు సినిమాల అనంతరం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, శేఖర్ వి చంద్ర దర్శకత్వంలో మరొక సినిమాతో పాటు తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా పవన్ ఒక సినిమా చేయనున్నారు. కాగా త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి అతి త్వరలో అధికారికంగా సమాచారం రానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పవన్ కు పెద్ద అభిమాని అయిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్, తొలిసారిగా వకీల్ సాబ్ ద్వారా ఆయన సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇక దీని అనంతరం శేఖర్ వి చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న మలయాళ మూవీ అయ్యప్పన్ కోషియం తెలుగు రీమేక్ కి కూడా థమన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు. అలానే మరోవైపు అతి త్వరలో ప్రకటన రానున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అందించనున్నాడని, తన లైఫ్ లో పవర్ స్టార్ ఒక సినిమా అవకాశం వస్తే చాలనుకున్న థమన్, కు ఈ విధంగా వెంటవెంటనే మూడు భారీ ప్రాజక్ట్స్ దక్కడంతో అతడు అమితానందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు టాక్. మరి రాబోయే రోజుల్లో ఈ మూడు సినిమాలకు థమన్ ఏ రేంజ్ లో మ్యూజిక్ అందిస్తాడో చూడాలి....! 

మరింత సమాచారం తెలుసుకోండి: