సాధారణంగా నాని సినిమాలో హీరోయిన్ అంటే... క్రేజ్ ఏమాత్రం తక్కువ ఉండదు. ఇది గుర్తింపు విషయానికి అసలు లోటు ఉండదు. గతంలో నాచురల్ స్టార్ నాని సరసన నటించిన ఎంత మంది కథానాయికలు స్టార్ హీరోయిన్స్ గా మారడం తెలిసిన విషయమే... నాని పక్కన హీరోయిన్ అంటేనే ప్లస్ పాయింట్ అనే స్థాయిలో బయట టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఇదే తరహాలో జెర్సీ చిత్రంలో నాని కి జంటగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ కు ఒక బంపర్ ఆఫర్ లభించిందట. ఈజ్ హీరోయిన్ ఎంత పని చేశారో తెలుసా... ఫ్యూచర్ ను చూపించే సినిమాకి శ్రద్ధ శ్రీనాథ్ ఓకే చెప్పారు..

జెర్సీ సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రద్ధ.. తన నటనతో  ప్రేక్షకులను ఆకర్షించింది. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో, ఆమెకు వరుస అవకాశాలు చాలానే వచ్చినట్లు తెలుస్తోంది. వరుస సినిమాలకు ఆమె ఇప్పటికీ ఓకే చెప్పినట్లు సమాచారం.
శ్రద్దా శ్రీనాథ్ చేయనున్న సినిమాల్లో ఒక బైలింగ్యువల్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ చిత్రం తమిళం, తెలుగులో రెండు భాషలలో చిత్రీకరించబోతున్నారు. ప్రమోద్ సుందర్  ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్ర చేయనుంది. ఈ సినిమా చేయడానికి ఎంతో ఎగ్జైట్ అవుతోంది శ్రద్దా శ్రీనాథ్. ఎందుకంటే కథ అలాంటిది మరి.
 
ఈ సినిమాను ఆర్కే ఇంటర్నేషనల్ నిర్మించనుంది. ఈ సినిమా కథ రెగ్యులర్ సినిమాల్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా... ఆలోచనాత్మకంగా ఉంటుందట. ఒకరకంగా ఈ సినిమా లో ఒక పాయింట్ ఆదిత్య 369 సినిమాను గుర్తు చేయనుందట. ఆ సినిమాలో ఫ్యూచర్ చూపించిన విధంగానే.... ఈ చిత్రం లో భవిష్యత్తు చూపించనున్నారట డైరెక్టర్. కాకపోతే ఆ సినిమాలో అది ఒక పాయింట్ మాత్రమే.... ఈ సినిమాలో ఫ్యూచర్ పూర్తి కథకు ఆధారం. ఈ సినిమా కథ 2050 టైమ్ పీరియడ్ లో సెట్ చేశారట దర్శకుడు ప్రమోద్. అంటే ఇప్పుడున్న టైమ్ పీరియడ్ కంటే 30 ఏళ్ల ముందు  ఉంటుందన్నమాట ఈ సినిమా కథ.  ఈ సినిమాకి కలియుగం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. సినిమా కథ చెన్నైలో జరుగుతుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: