అయితే ఈ సినిమా రీమేక్ హక్కులని సొంతం చేసుకున్నటినుంచి లీడ్ రోల్స్ కోసం సాగిన వేట ఎంతకీ తెగలేదు. ముందు ప్రధాన పాత్రలకు ప్రచారం జరిగిన పేర్లు వేరు. చివరికేమో ఎవరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ లైన్లోకి వచ్చాడు. ఒరిజినల్లో బిజు మీనన్ చేసిన పోలీస్ పాత్రను పవన్ చేయబోతున్నట్లు వెల్లడైంది. మరి పృథ్వీరాజ్ చేసిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ పాత్ర ఎవరిది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇకపోతే పవన్తో రెండు సినిమాలు చేసిన ఘనత కొంతమంది కె దక్కింది. అందులో ఒకరు శృతి హాసన్..తొలిసారి ‘గబ్బర్ సింగ్లో నటించిన శ్రుతి.. ఆ తర్వాత ‘కాటమరాయుడు’లో ఆయనతో జోడీ కట్టింది.ఇప్పుడు పవన్తో మూడుసార్లు నటించిన ఏకైక కథానాయికగా ఆమె రికార్డు సృష్టించబోతోంది. ఆమె ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్తో జోడీ కట్టబోతున్నట్లు చాన్నాళ్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రుతినే స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. త్వరలోనే పవన్ సినిమా సెట్లో అడుగు పెట్టబోతున్నట్లు ఆమె వెల్లడించింది.
ఇక ఈ సినిమా తర్వాత పవన్ మూడు సినిమాలు ఒప్పుకున్న సంగతి అందరికి తెలిసిందే.. క్రిష్ దర్శకత్వంలో ఒకటి కాగా , హరీశ్ శంకర్ దర్శకత్వంలో మరొకటి.. సురేందర్ రెడ్డి దర్సకత్వంలో రాబోయే సినిమా చర్చల దశలో ఉంది..