ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ పాపులారిటీ తో కొనసాగుతున్న స్టార్ నటీమణుల్లో రష్మిక మందన్న కూడా ఒకరు. నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఛలో సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక ఆ మూవీతో మంచి సక్సెస్ ను అందుకుని బాగా పేరు దక్కించుకున్నారు. ఆపై విజయ్ దేవరకొండ సరసన పరుశురాం దర్శకత్వంలో నటించిన గీత గోవింద మూవీ తో ఏకంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ అందుకున్నారు రష్మిక.

ఇక అక్కడి నుండి వరుస అవకాశాలతో కొనసాగిన రష్మిక మందన్న ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి ఆ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అనంతరం నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ లో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించిన రష్మిక ఆ మూవీతో కూడా మరొక సక్సెస్ ని అందుకున్నారు. ఇక ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుసగా సినిమాల అవకాశాలు అందుకుంటూ కొనసాగుతున్న రష్మిక అతి త్వరలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఒక మూవీ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ పట్టేసినట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం.

ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక సినిమా అలానే అయ్యప్పన్ కోషియం రీమేక్లో కూడా నటించనున్న పవర్ స్టార్ ఈ మూడు సినిమాల అనంతరం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మాతగా ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న స్టైలిష్ కమర్షియల్ ఎంటర్ టైనర్ మూవీలో నటించనున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ని  ఎంపిక చేసిందట మూవీ యూనిట్. అన్ని వర్గాల ప్రేక్షలని ఆకట్టుకునే ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో హీరో పవన్ కళ్యాణ్ పాత్ర తో పాటు హీరోయిన్ రష్మిక పాత్ర కూడా ప్రేక్షకులను ఎంతో అలరిస్తుందని సమాచారం. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త గనుక నిజమైతే తొలిసారిగా పవర్ స్టార్ తో రష్మిక జోడీని వెండితెరపై చూడవచ్చు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: