ఈ క్రమంలోనే బలమైన కథలను ఎంచుకుంటూ వరుసగా విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న సుధీర్ బాబు ఆ తర్వాత సమ్మోహనం అనే సినిమాతో క్లాస్ నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవల.. నాచురల్ స్టార్ నాని తో కలిసి వి అనే సినిమాలో నటించి తన సిక్స్ ప్యాక్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇకపోతే సమ్మోహనం అనే సినిమాతో క్లాస్ నటుడిగాపేరు తెచ్చుకున్న సుధీర్ బాబు మరోసారి తన లక్కీ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణతో కలిసి సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అటు అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒక ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో రెండు సినిమాలు వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. అయితే ఈ సినిమా కోసం ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. కాగా ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.