ఈటీవీ లో ప్రసారమయ్యే బుల్లితెర కార్యక్రమాలు ఎన్నో  ప్రేక్షకులను కూడా అలరిస్తూ ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి అనే విషయం తెలిసిందే.  ఇప్పటికే ఈ టీవీ లో పలు రకాల కార్యక్రమాలు వస్తూ ఉండగా అన్ని కార్యక్రమాలు కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చినవి కావడం గమనార్హం. అయితే ఈ క్రమంలోనే వెండితెరపై ఎన్నో ఏళ్ల పాటు కమెడియన్గా అలరించి ఇప్పటికీ కూడా తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న స్టార్ కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా మారి ఈటీవీలో ఆలీతో సరదాగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు అనే విషయం తెలిసిందే.


 ఆలీతో సరదాగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఇక ప్రతీ వారం కూడా ఈ కార్యక్రమానికి అతిధులను ఆహ్వానించి.. వారిని ఇంటర్వ్యూ చేస్తూ అభిమానులకు తెలియని పలు ఆసక్తికర విషయాలను బయట పెడుతూ ఉంటారు వ్యాఖ్యాత ఆలీ. అంతేకాకుండా ఇక తనదైన శైలిలో చిలిపి ప్రశ్నలు అడుగుతూ అటు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటాడు. ప్రతి వారం కూడా కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ మంచి రేటింగ్ సాధిస్తూ దూసుకుపోతుంది అనే విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇటీవల ఆలీతో సరదాగా కార్యక్రమానికి సంబంధించి వచ్చేవారం ఎపిసోడ్  ప్రోమో విడుదల సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఇక ప్రోమో  లో భాగంగా ఒకప్పుడు ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అలరించి ప్రస్తుతం బుల్లితెరకు  పరిమితమైన జయలలిత.. వరలక్ష్మి లు గెస్ట్ లుగా వచ్చారు. ఈ క్రమంలోనే వారిని పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగిన వ్యాఖ్యాత అలీ  అభిమానులకు తెలియని విషయాన్ని కూడా తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తిని నమ్మి మీరు ఎన్నో కోట్ల రూపాయల మోసపోయారట కదా అంటూ జయలలితను అలీ ప్రశ్నించగా.. అవును అంటూ సమాధానం చెబుతుంది నటి జయలలిత.  కొన్ని రోజుల పాటు నమ్మకంగా ఉన్న వ్యక్తి ఒకేసారి నాలుగు కోట్ల రూపాయలు తీసుకొనిమోసం చేశాడని అతన్ని నమ్మడం వల్ల కనీసం ప్రస్తుతం తాను కార్ లో కూడా తిరగలేక పోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అది తలుచుకుంటే నామీద నాకే అసహ్యం వేస్తుంది అంటూ బాధపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: