తెలుగు సినిమా పరిశ్రమలో మాటల మాంత్రికుడు గా ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేక క్రేజ్, మంచి పేరు దక్కించుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. కథా మాటల రచయితగా తన సినీ జీవిత ప్రయాణం ప్రారంభించిన త్రివిక్రమ్ ఆ తర్వాత దర్శకుడిగా మారి ప్రస్తుతం మంచి విజయాలతో కొనసాగుతున్నారు. ముందుగా విజయభాస్కర్ దర్శకత్వంలో ఎస్పి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణు, లయ ల కలయికలో తెరకెక్కిన స్వయంవరం సినిమాకి కథ మాటలు అందించిన త్రివిక్రమ్ 1999లో విడుదలైన ఈ సినిమా ద్వారా మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఆ తర్వాత మరొక సారి వేణు హీరోగా తెరకెక్కిన చిరునవ్వుతో సినిమాకి కూడా కథా రచన చేసిన త్రివిక్రమ్ దానితో కూడా విజయాన్ని అందుకున్నారు.

ఆపై నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి, నువ్వే కావాలి వంటి సినిమాలకు కూడా మాటలు కథ అందించిన త్రివిక్రమ్ ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఆపై తరుణ్ హీరోగా శ్రియ హీరోయిన్ గా రూపొందిన నువ్వే నువ్వే సినిమా ద్వారా దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకున్నారు త్రివిక్రమ్. దాని అనంతరం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో అతడు వంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన త్రివిక్రమ్ దాని అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జల్సా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో జులాయి వంటి సినిమాలతో మరో రెండు బ్లాక్బస్టర్ విజయాలు అందుకున్నారు.

అక్కడి నుండి వరుసగా అవకాశాలతో కొనసాగిన త్రివిక్రమ్ ఇటీవల అరవింద సమేత, అలవైకుంఠపురములో సినిమాలతో రెండు భారీ సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో తన తదుపరి సినిమా తీయనున్నారు త్రివిక్రమ్. ఇక ఆయన టాలీవుడ్ కి రంగప్రవేశం చేసి నిన్నటితో సక్సెస్ఫుల్ గా 22 సంవత్సరాలు పూర్తవడంతో పలువురు అభిమానులు ఆయనకు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని అంటూ కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: