"మనీ హీస్ట్" ఐదవ సీజన్ ప్రేక్షకులను అలరించడానికి ఓటిటికి వచ్చేసింది. ఈ ఎపిసోడ్‌లతో మరోసారి ఈ సిరీస్ తన అభిమానులను రంజింపజేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన 'మనీ హీస్ట్' సీజన్ 5 కోసం అభిమానులు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రావడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఈ సందర్భంగా 'మనీ హీస్ట్' గురించి ఫన్నీ పోస్ట్‌లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కనిపించే ఓ పోస్ట్‌లో 'మనీ హీస్ట్' పాత్రలను బాలీవుడ్ తారలతో పోల్చడం చూసి పంకజ్ త్రిపాఠి అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు.


వాస్తవానికి "మనీ హీస్ట్"లోని ప్రసిద్ధ పాత్రలన్నీ బాలీవుడ్‌లో ఏ స్టార్స్ కు సరిపోతాయనే విషయాన్ని ఒక పోస్టులో వెల్లడించారు. ఆయుష్మాన్ ఖురానా 'మనీ హీస్ట్' అల్వారో మోర్టే (ప్రొఫెసర్)గా ఎంపికయ్యారు. మరోవైపు మోనికా పాత్రలో తాప్సీ, రాకెల్‌గా టబు, టోక్యో పాత్రలో అలియా భట్, బెర్లిన్ పాత్రలో రణ్‌దీప్ హుడా, నైరోబిగా రాధికా ఆప్టే, డెన్వర్‌గా రాజ్‌కుమార్ రావు, ఆర్తురోగా పంకజ్ త్రిపాఠిని చూపిస్తూ సోషల మీడియాలో పోస్ట్ అయిన ఓ పిక్ ఈ గందరగోళానికి కారణమైంది.

పంకజ్ త్రిపాఠి కోసం సదరు నెటిజన్ ఎంచుకున్న ఈ పాత్ర ఆయన అభిమానులకు కోపం తెప్పించింది. ఈ పోస్ట్‌పై వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని భారతీయ వెర్షన్ చేయవద్దు అంటూ సెటైర్లు వేస్తున్నారు మరికొందరు. ఎన్రిక్ ఆర్స్ 'మనీ హీస్ట్'లో ఆర్టురో పాత్రలో కనిపించాడు. ఈ పాత్రను అందరూ ద్వేషిస్తారు. ప్రజలు ఈ పాత్రను ట్విట్టర్‌లో చెత్తగా పిలిచారు. ఈ విషయాన్ని ప్రొఫెసర్ స్వయంగా వీడియోలో వెల్లడించారు. షోలో ఆర్టురో ఒక మోసగాడు. ఆయన కారణంగా బ్యాంకును దోచుకున్న ప్రేక్షకుల అభిమాన దొంగల ముఠా ఇబ్బందుల్లో పడుతుంది. అతని పాత్రలో పంకజ్ త్రిపాఠిని ఊహించడం ఆయన అభిమానుల కోపానికి కారణమైంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: