ప్రస్తుతం రామ చరణ్ తేజ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ముగియగానే దర్శకుడు శంకర్ సినిమాతో బిజీ అయిన విషయం తెలిసిందే. వీరి కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్15 వ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా ఇటీవలే పూణేలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అటు నిర్మాత దిల్ రాజు సైతం అనుకున్న దాని కన్నా మించి ది బెస్ట్ మూవీగా ఇండస్ట్రీకి ఇవ్వడానికి కోట్లు కుమ్మరిస్తున్నారట. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ చేస్తుండగా ఓ స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్ లో మునుపెన్నడూ లేని విధంగా కోట్లకు కోట్లు వెచ్చిస్తున్నారు అని సమాచారం.

అత్యంత సుందరమైన ప్రదేశాలలో ఈ సాంగ్ ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో కియారానే కనిపిస్తుందని అందరూ అనుకోగా ఇపుడు ఈ పాటలో కియరాతో పాటు స్టార్ హీరోయిన్ తమన్నా కూడా చెర్రీతో ఆడిపాడనున్నారని సమాచారం. మిల్కీ బ్యూటీ కూడా ఈ సాంగ్ లో స్టెప్పులు వేయనుందని తెలుస్తోంది. ఈ వార్త విన్న మెగా అభిమానులు చెర్రీ తమన్నా కాలు కదిపింది అంటే ఇక ఈ పాటకు రికార్డుల మోతే అంటున్నారు. గతంలో అగ్ర హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్ తో హీరోయిన్ గా చేసిన తమన్నా "జై లవకుశ" సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించినున్న విషయం తెలిసిందే. అలాగే ఆగడు సినిమాలో మహేష్ తో జత కట్టిన ఈ భామ "సరిలేరు నీకెవ్వరు" చిత్రం లో మహేష్ తో "ఆజ్ రాత్ మీరే గర్ మే" అనే స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది.

ఈ రెండు స్పెషల్ సాంగ్స్ కూడా ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. కాగా ఇపుడు చెర్రీతో  కూడా ఈ స్పెషల్ సాంగ్ కాంబినేషన్ రికార్డు క్రియేట్ చేస్తుందని అంటున్నారు. మరి చెర్రీతో తమన్నా స్పెషల్ సాంగ్ ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. పొలిటికల్ థ్రిల్లర్ గా మన ముందుకు రాబోతున్న ఈ చిత్రంకి త్వరలోనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఎస్.ఎస్.థమన్ ఈ సినిమాకి మ్యూజిక్ ని సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: