టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. 60 పదుల వయసు లో కూడా యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నాడు చిరు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తన 'ఆచార్య' సినిమా షూటింగ్ ని పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' సినిమా చేస్తున్నాడు చిరు. మలయాళంలో హిట్టయిన లూసిఫర్ సినిమాకి ఇది తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాతో పాటు మెహర్ రమేష్ తో బోలా శంకర్, అలాగే బాబితో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ హీరో అదే జోరుతో మరో కొత్త ప్రాజెక్టుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో చలో, భీష్మ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్లో చిరు ఓ సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. అగ్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ కి దర్శకుడు కథ వినిపించగా ఆ కథ చిరు కి బాగా నచ్చిందట. దీంతో వెంకీ కుడుముల తో సినిమాకి వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్  కూడా వచ్చే అవకాశం ఉందట.

 కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక చెర్రీ సరసన పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తుండడం విశేషం. సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ మావోయిస్టులు గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మణి శర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: