ప్రస్తుతం బుల్లి తెరపై జబర్దస్త్ కార్యక్రమానికి ఏ రేంజిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమం వస్తుంది అంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు తెలుగు ప్రేక్షకులు. ఈ కార్యక్రమం చూసి హాయిగా కాసేపు తనివితీరా నవ్వుకుంటూ ఉంటారు.తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్న జబర్దస్త్ కార్యక్రమం లో సుడిగాలి సుదీర్ టీమ్ ఎంతో పాపులారిటీ సంపాదించింది. సుడిగాలి సుధీర్ టీం లో ఉండే గెటప్ శ్రీను, రాంప్రసాద్, సుధీర్ ముగ్గురు కూడా జబర్దస్త్ ఎంతగానో పేరు తెచ్చుకున్నారు..



 కేవలం వీరి టీం పర్ఫామెన్స్ చూసి నవ్వుకోవడానికి ఎంతో మంది జబర్దస్త్ షో చూడటానికి ఆసక్తి చూపుతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి ప్రేక్షకులను అలరిస్తుంది సుడిగాలి సుధీర్ టీం. కానీ మరి కొన్ని రోజుల్లో జబర్దస్త్ లో ఈ ముగ్గురు కనిపించకుండా పోతున్నారా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని ఎవరో చెప్పలేదు ఏకం గా సుడిగాలి సుదీర్ రాంప్రసాద్ గెటప్ శీను లు చెప్పడం గమనార్హం  ఇటీవల ఎక్స్ ట్రా జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియా  లో వైరల్ మారి పోయింది.



 ప్రోమో ఎప్పటిలా గానే ఎంతో సందడి సందడిగా సాగే పోయింది అని చెప్పాలి. కానీ జబర్దస్త్ ప్రోమో లో భాగంగా చివరిలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది సుడిగాలి సుధీర్ టీం. ఎన్నో రోజులనుంచి జబర్దస్త్ కార్య క్రమంలో కొనసాగిస్తున్నామని.. ఇప్పుడు జబర్దస్త్ కార్యక్రమం వదిలేస్తున్నాము అంటూ రాంప్రసాద్ గెటప్ శీను సుడిగాలి సుదీర్ ఎమోషనల్ అయ్యారు. అయితే సుడిగాలి సుధీర్ టీం జబర్దస్త్ ను వదిలేస్తున్నాము అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. నిజంగానే వీళ్ళు వదిలేస్తున్నారా కేవలం ప్రోమో కోసమే ఇలా చేశారా అన్న విషయంలో మాత్రం ఫ్యాన్స్ అందరు షాక్ లో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: