సినీ నటుడిగా తన కెరీర్ ప్రారంభించిన రియల్ హీరో సోనూసుద్ రియల్ లైఫ్ లో ఆపదలో ఉన్న వారికి ఆపద్భాంధవుడుగా మారాడు.కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక వలస కూలీల బాధలు అర్థం చేసుకున్న ఈయన బస్సులు రైళ్లు విమానాల ద్వారా వారిని వాళ్ళ స్వస్థలాలకు పంపించారు. అంతేకాకుండా ఇప్పటికి కూడా ఏదైనా సాయం కావాలంటే దేవుడిలా ముందుకు వచ్చి సాయం చేస్తారు.అయితే ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రియల్ హీరోగా మారిన సోనూ సూద్ కు ఇప్పుడు దుబాయ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. సోనూసుద్ చేసిన సేవలకు గుర్తింపుకు గాను ఆయనకు గోల్డెన్ వీసాను ఇచ్చి అక్కడి సత్కరించింది.యూఏఈ గోల్డెన్ వీసా అంటే అసలు మాములు విషయం కాదు. అరుదైన వ్యక్తులకు మాత్రమే ఈ వీసాని ఇస్తారు.ఇక్కడ వ్యాపారం చేసేవారికి కంపెనీలు నెలకొల్పేవారికి మాత్రమే ఇస్తారు. వీరిలో కూడా ప్రముఖమైన వ్యక్తులకు మాత్రమే గోల్డెన్ వీసా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.



కానీ ఇలాంటి గోల్డెన్ వీసాను భారత్ కు చెందిన సోనూసుద్ కు ఇవ్వడం నిజంగా విశేషంగానే చెప్పుకోవచ్చు. అయితే సోనూసుద్ అప్పుడప్పుడు దుబాయ్ ను విజిట్ చేస్తూ ఉంటాడు.ఇక అంతేకాకుండా ఇక్కడ కొన్ని సినిమాల షూటింగ్లో కూడా ఆయన పాల్గొన్నాడు.ఇక ఈ సందర్భంగా సోనూసుద్ మాట్లాడుతూ 'అత్యంత అరుదైన గోల్డెన్ వీసాను అందించినందుకు దుబాయ్ ప్రభుత్వానికి ధన్యవాదములు తెలుపున్నా.. నాకు దుబాయ్ తో ఆత్మీయ అనుబంధం చాలా ఎక్కువగా ఉంటుంది. నేను చాలా ఇష్టపడే దేశాల్లో దుబాయ్ ఒకటి. ఇప్పుడు ఇది అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్న మంచి ప్రదేశం. ఇక్కడి అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతన్నా..' అని అన్నాడు.అలాగే తనకు సహకరించిన బ్లూ చిప్ ఇన్వెస్ట్ మెంట్స్ ఎల్ ఐసీ యజమానులు రవీందర్ సోనీ సూరజ్ జుమానీ అల్నాహదా సెంటర్లకు కూడా సోనూ థ్యాంక్స్ చెప్పారు.ఇక ఇదిలా ఉండగా సోనూ సుద్ మరోవైపు సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో ఆయన ఆచార్య సినిమాలో కనిపించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: