సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట చిత్రం విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతోంది. దీంతో ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ జంటగా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ రోజున విడుదలై మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ తోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ రావడం ప్లస్ గా మారింది. మహేష్ బాబు ఓపెనింగ్ అదరగొట్టేశాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఈ చిత్రం రికార్డులను తిరగరాస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని అభిమానులు తెలియజేస్తున్నారు.


ఇలా అసలు విషయంలోకి వస్తే హైదరాబాద్ సిటీలో అడ్వాన్స్ బుకింగ్ .. గ్రాఫ్ విషయానికి వస్తే రూ.8 కోట్ల రూపాయలు వసూలు కావడం తో పాటుగా రికార్డుల మోత మోగిస్తోందట. దాదాపుగా ఇంకా 3 లక్షలకు పైగా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్లుగా సమాచారం. ఇక అడ్వాన్స్ బుకింగ్ టికెట్ లే రూ.8 .10 కోట్ల రూపాయలు వసూలు చేయగా కేజీఎఫ్ -6.2 కోట్లు, rrr అడ్వాన్స్ బుకింగ్ రూ.8 కోట్లు, భీమ్లా నాయక్ -6.2 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. ప్రస్తుతం సర్కార్ వారి పాట చిత్రం నాన్ rrr రికార్డులను బ్రేక్ చేసేసింది. rrr మూవీ రూ.10.89 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ వసూలు చేయగా.. ఒక హైదరాబాదులోనే రూ.8 కోట్లకు పైగా చేసింది. మొత్తం మీద రూ.14.54 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టినట్లుగా సమాచారం.


ఇక యూఎస్ఏ ప్రీమియంలను కూడా సర్కారు వారి పాట చిత్రం బాగా దూసుకుపోతోంది. ఇక ప్రీమియర్ తోనే ఆఫ్ మిలియన్ మార్కను చేరువైంది అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరి ఈ చిత్రం ఎంతటి రికార్డులను సృష్టిస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: