ఈ క్రమంలోనే సౌరవ్ గంగూలీ హోస్ట్ చేస్తున్న దాదాగిరి అనే రియాల్టీ షోలో సందడి చేసేందుకు ఎంతోమంది సినీ సెలబ్రిటీల ఎంట్రీ ఇస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో సౌరవ్ గంగూలీ దాదా గిరి అనే రియాల్టీ షోలో అతిలోక సుందరి శ్రీదేవి ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది. దీంతో ఇక ఈ రియాలిటీ షోకి ఒక్కసారిగా రేటింగ్ పెరిగిపోయింది అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మరోసారి శ్రీదేవి ప్రతిరూపం అటు సౌరవ్ గంగూలీ రియాలిటీ షో లో సందడి చేసింది అని తెలుస్తోంది. శ్రీదేవి ప్రతిరూపం అంటే ఎవరో కాదు ఏకంగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.
ప్రస్తుతం జాన్వీ కపూర్ శ్రీదేవి వారసురాలిగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల ఎంట్రీ ఇచ్చింది అనే విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇటీవల సౌరవ్ గంగూలీ హోస్ట్ చేస్తున్న దాదాగిరి అనే రియాల్టీ షోలో సందడి చేసింది. అయితే గతంలో ఇదే షోకి శ్రీదేవి రావడం జరిగింది. మామ్ మూవీ ప్రమోషన్లో భాగంగా శ్రీదేవి వస్తే ఇక ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కూడా ఈ షోకి రావడంతో అభిమానులు అందరూ ఎంతో మురిసి పోతున్నారు. 2009 నుండి బెంగాలీ కన్నడలో ప్రసారమయ్యే రియాలిటీ షో హోస్ట్ చేస్తున్నారు సౌరవ్ గంగూలీ..