అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ తరం హీరో అఖిల్. అయితే చిన్నపుడు తన తనతో అందరినీ ఆకట్టుకుని అంచనాలను పెంచేసిన అఖిల్ పెద్దయ్యాక మాత్రం అందరి ఆశలను నీరుగార్చేస్తున్నాడు. ఈ మధ్య వచ్చిన మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచలర్ మినహాయించి మరే సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో ఈ సారి మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి గట్టిగానే కష్టపడుతున్నాడు. కెరీర్ ఆరంభంలో మంచి సినిమాలతో ఆకట్టుకున్నా తన లాస్ట్ సినిమా సైరా నరసింహారెడ్డి తో మళ్ళీ బోల్తా కొట్టాడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ఆ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ అఖిల్ తోనే కావడం గమనార్హం. అందుకే ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ తో పని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయినట్లే ఉంది.

కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి సురేందర్ రెడ్డి తప్పుకుంటున్నాడట. ఈ వార్తతో అఖిల్ ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది. అదేంటి ఏజెంట్ సినిమా కోసం అఖిల్ ను ఒక జేమ్స్ బాండ్ లా కండలు తిరిగిన దేహంతో రెడీ చేసి.. సినిమా నుండి పోస్టర్ లు వదిలి... చివరికి డైరెక్టర్ వెళ్లిపోవడం ఏమిటని కంగారు పడుతున్నారు. అయితే విషయం అది కాదట. ఈ సినిమా నిర్మాణంలో సురేందర్ రెడ్డి కూడా చేయి కలిపారట. అయితే గత నవంబర్ లో పూర్తి చేసుకున్న యూరోప్ మేజర్ షెడ్యూల్ చుసీనా బృందం హ్యాపీ గా లేదట. అందుకే అదే షెడ్యూల్ ను మళ్ళీ రీ షూట్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారట.

అయితే ఇప్పటికే అఖిల్ గాయం కారణంగా షూట్ వాయిదా పడడం మరియు ఇప్పుడు రీ షూట్ అంటే ఈ సినిమా రిలీజ్ ఇంకా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. కాగా ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలజ పాత్రా పోషిస్తున్నారు. ఇక అఖిక్ సరసన సాక్షి వైద్య నటిస్తోంది. మరి చూద్దాం ముందు ముందు ఈ సినిమా విషయంలో ఇంకేమి జరుగుతుందో.. ?    
 

మరింత సమాచారం తెలుసుకోండి: