హీరోయిన్లందరికీ అభిమానులు ఉంటే ఖుష్బూకి తమిళనాట భక్తులు ఉన్నారు. ఈ భక్తితోనే గుడి కట్టించారు. అయితే ఈ అభిమానంతో పాటు, బాడీ షేమింగ్నీ ఫేస్ చేసింది. బరువు పెరిగాక చాలామంది ఖుష్బూ కటౌట్ని కామెంట్ చేశారు. అలాగే ఖుష్బూ కూతుళ్లని ఇతర సెలబ్రిటీ డాటర్స్తో పోల్చుతూ కామెంట్ చేశారు. ఇక కూతుళ్లని అనగానే ఖుష్బూ వెంటనే రియాక్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్లో బాడీషేమింగ్ చేసిన యూజర్స్కి వార్నింగులు ఇచ్చింది.
ఓపెన్గా మాట్లాడడంలో పోటీలు పెడితే సమీరా రెడ్డికి బోల్డన్ని గోల్డ్ మెడల్స్ వస్తాయి. డిప్రెషన్ నుంచి స్టార్ట్ చేస్తే డిక్టేటర్స్ వరకు అన్నింటిని టచ్ చేసే సమీరా రెడ్డి హీరోయిన్గా ఉన్నప్పుడు బాడీషేమింగ్ని ఫేస్ చేశానని చెప్పింది. డార్క్ స్కిన్ టోన్ని లైట్గా మార్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశానని, లెన్సులు వాడేదాన్నని చెప్పింది. అయితే ఇప్పుడు ఆలోచిస్తే నామీద నాకే జాలేస్తోందని, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకున్నప్పుడే ఆనందంగా ఉంటామని ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది సమీరా రెడ్డి.
ఐశ్వర్యారాయ్కి 2011లో కూతురు ఆరాధ్య పుట్టాక బాడీ షేమింగ్ని ఫేస్ చేసింది. పోస్ట్ ప్రెగ్నెన్సీతో బరువు పెరిగిన టైమ్లో 2012 కాన్స్ ఫెస్టివల్కి హాజరైంది ఐష్. అక్కడ రెడ్ కార్పెట్పై బొద్దుగా ఉన్న ఐశ్వర్యని చూసి చాలామంది కామెంట్ చేశారు. ఈ లుక్ ఏంటని విమర్శించారు. అయితే ఐష్ ఈ బాడీషేమింగ్పై ఘాటుగా స్పందించారు. పక్కనోళ్లని జడ్జ్ చెయ్యడం మానెయ్యండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండని కామెంట్ చేసింది.
విద్యా బాలన్ యాక్టింగ్కి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. బోల్డన్ని పురస్కారాలు అందుకుంది. కానీ జనాలు మాత్రం విద్య బరువు పెరిగినప్పుడు ఘోరంగా విమర్శించారు. 'భూల్ బులాయా' కోసం బరువు పెరిగినప్పుడు బాడీ షేమింగ్ని ఫేస్ చేసింది. కానీ విద్య మాత్రం విమర్శలని పట్టించుకోలేదు. 'డర్టీ పిక్చర్' కోసం మరింత వెయిట్ పెరిగింది.