టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న నటులలో ఒకరు పోసాని కృష్ణ మురళి..నటుడిగా ఇంకా అలాగే డైరెక్టర్ గా మంచి రచయితా గా పోసాని కృష్ణ మురళి కి ఎన్నో హిట్స్ ఉన్నాయి..ఇక గాయం సినిమా తో ప్రారంభమైన పోసాని కృష్ణ మురళి నట ప్రస్థానం మొన్న విడుదలైన సర్కారు వారి పాట సినిమా వరుకు కూడా కొనసాగింది.ఇక కేవలం నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా పోసాని కృష్ణ మురళి బాగా పాపులర్ అయ్యాడు అనే విషయం మన అందరికి కూడా తెలిసిందే..ప్రస్తుతం ఆయన వైసీపీ పార్టీ లో కూడా కొనసాగుతున్నాడు..సందర్భాన్ని బట్టి ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ ఇంకా జనసేన పై విరుచుకుపడిన సంఘటనలు చాలానే ఉన్నాయి..రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అనేది చాలా సర్వసాధారణం.ఇక 2009 వ సంవత్సరం లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన పోసాని కృష్ణ మురళి..ఇక ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన వైపు వెళ్లిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇక ఇవి అన్ని కూడా పక్కన పెడితే గత కొంత కాలం క్రితం పోసాని కృష్ణ మురళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  పై కామెంట్స్ చేశాడు.


పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన వ్యాఖ్యలు ఎవ్వరు అంత తేలికగా మర్చిపోలేరు.ఇక ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఇక పవన్ కళ్యాణ్ తో పని చేసిన అనుభవం గురించి మాట్లాడుతూ 'పవన్ కళ్యాణ్ సెట్స్ లో ఉన్నంతసేపు కూడా కేవలం తన సినిమా గురించి మాత్రమే చూసుకుంటారు..అవతలి వ్యక్తి గురించి మాట్లాడడం అసలు ఆయనకి ఇష్టం ఉండదు..అనవసరమైన మాటలు కూడా ఎక్కువగా మాట్లాడడు.ఇక రాజకీయం గా మేము వేరు అయ్యినప్పటికీ కూడా సెట్స్ లోకి వచ్చిన తర్వాత సినిమా గురించి తప్ప వేరే విషయాలు ఏవి కూడా చర్చించడు' అంటూ చెప్పుకొచ్చాడు పోసాని కృష్ణ మురళి.ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: