ఇక అక్రమ ఆర్థిక లావాదేవీల ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ ఐటమ్ బ్యూటీ నోరా ఫతేహిని పోలీసులు విచారించారు. సుకేష్ చంద్రశేఖర్ కు సంబంధించి 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీకి చెందిన ఆర్థిక నేరాల విభాగానికి చెందిన అధికారులు నోరా ఫతేహిని పలు రకాలుగా విచారించారు.నోరా ఫతేహిని 50 ప్రశ్నల వరకూ అధికారులు అడిగారు. ఆమెకు ఎలాంటి బహుమతులు వచ్చాయి? ఎవరితో మాట్లాడింది? వారిని ఎక్కడ కలిశారన్నది పోలీసులు అడిగినట్లు తెలుస్తోంది.ఇంకా ఈ విచారణలో తనకు సుఖేష్ గర్ల్ ఫ్రెండ్ అయిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో సంబంధాలు లేవని.. తాను సుకేష్ తో విడిగానే మాట్లాడినట్టు వెల్లడించింది. నెయిల్ ఆర్ట్ ఫంక్షన్ కోసం అతడి భార్య తనతో మాట్లాడిందని.. ఆపై తరచూ తనకు ఫోన్ చేసేదని ఆమె తెలిపారు. వారు ఆమెకు బీఎండబ్ల్యూ ఇతర కార్లు బహుమతిగా ఇచ్చారని వెల్లడించారు. అతడి నేర నేపథ్యం తనకు తెలియదని నోరా ఫతేహి పోలీసులకు తెలిపింది. సుకేష్ తన మేనేజర్ కజిన్ తో ఎక్కువగా మాట్లాడేవాడని చెప్పింది.


ఈ క్రమంలోనే రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో హీరోయిన్ నోరా ఫతేహికి ఢిల్లీ పోలీసుల ఆర్ధిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ చుట్టూ జరిగిన కుట్రలో నోరా ప్రమేయం లేదని.. క్రైమ్ సిండికేట్ గురించి ఆమెకు తెలియదని పోలీసులు తెలిపారు.రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్ శివిందర్ సింగ్ లు జైళ్లో ఉన్న సమయంలో వారికి బెయిల్ ఇప్పిస్తానని చెప్పాడు చంద్రశేఖర్. కేంద్ర న్యాయ శాఖలోని ఉన్నతాధికారిగా వారి భార్యలను కలిసి బెయిల్ ఇప్పిస్తానని అందుకు రూ. 200 కోట్ల ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో చంద్రశేఖర్ ను నమ్మిన వారు రూ. 200 కోట్లు అప్పజెప్పారు. ఆ తరువాత వారికి సుకేశ్ కనిపించలేదు. ఈ డబ్బుతో చెన్నైలోని ఓ బంగ్లాను కొన్నట్లు వారు పేర్కొన్నారు.సుకేష్ కేసులో బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇంకా నోరా ఫతేహిలను ప్రశ్నించారు. తాజాగా నోరా ఫతేహికి క్లీన్ చిట్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: