‘అఖండ’ బ్లాక్ బష్టర్ హిట్ తరువాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రెడీ అవుతున్న మూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈమూవీని దసరా రేస్ కు విడుదల చేయాలని భావించారు. అయితే ఆమధ్య బాలకృష్ణకు కరోనా రావడం ఆతరువాత టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో షూటింగ్ లు నిలిచిపోవడంతో ఈమూవీ షూటింగ్ అనుకున్న విధంగా పూర్తి కాకపోవడంతో బాలయ్య దసరా రేస్ మిస్ అయ్యాడు.




ప్రస్తుతం టర్కీలో ఈమూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ పూర్తి కావడంతో ఈమూవీ షూటింగ్ అంతా పూర్తి అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఈమూవీని డిసెంబర్ లో క్రిస్మస్ సమయంలో విడుదలచేయాలని ఈమూవీ నిర్మాతలు మైత్రీ మూవీస్ అదేవిధంగా గోపీచంద్ మలినేని భావిస్తున్నట్లు తెలుస్తోంది.



దీనికి కారణం ‘అఖండ’ సెంటిమెంట్ అంటున్నారు దీనికితోడు డిసెంబర్ లో టాప్ హీరోల సినిమాల విడుదల ఏమీ లేకపోవడంతో బాలయ్య మూవీకి భారీ కలక్షన్స్ వస్తాయని మైత్రీ మూవీస్ ప్లాన్ అని టాక్. అయితే ఈ ప్లాన్ బాలకృష్ణ కు నచ్చలేదు అన్న సంకేతాలు వస్తున్నాయి. దీనికి కారణం బాలయ్య దృష్టి అంతా వచ్చే సంవత్సరం సంక్రాంతి రేస్ పై ఉంది అని అంటున్నారు.



రాబోతున్న సంక్రాంతి రేస్ కు ‘ఆదిపురుష్’ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ లాంటి భారీ సినిమాలు ఉన్నప్పటికీ భయపడకుండా తాను కూడ సంక్రాంతి రేస్ లో పోటీ పదాలని బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాలయ్య సినిమాను అదేవిధంగా సంక్రాంతికి విడుదల కాబోతున్న ‘వాల్తేర్ వీరయ్య’ ను మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పరిస్థితులలో తమకు నష్టం జరుగుతుందని బాలయ్య మూవీని క్రిస్మస్ కు అదేవిధంగా చిరంజీవి మూవీని సంక్రాంతి కి విడుదల చేయడానికి మైత్రీ మూవీస్ ఆలోచనలలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో బాలయ్య ఈ సూచనలకు ఎంతవరకు ఓకె చేస్తాడు అన్న సందేహాలు ఉన్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: