సంగీత దర్శకుడు కీరవాణి వారసుడు శ్రీ సింహ కోడూరి  సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సంగీతంలోనే కాకుండా నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మత్తు వదలరా చిత్రంతో మొదటిసారిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన శ్రీ సింహ ఆతర్వాత తెల్లవారితే గురువారం అనే చిత్రంతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా తను నటించిన సినిమా దొంగలున్నారు జాగ్రత్త. ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా ఈ సినిమాని మర్చిపోయారు. ఈ చిత్రం సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల అయింది. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా ఇప్పుడు ఓ టీ టి లో స్త్రిమ్మింగ్ కు సిద్ధమయింది.


ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ అయినా నెట్ ఫ్లిక్స్సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది అక్టోబర్ 7వ తేదీ నుంచి ఈ సినిమాని తెలుగు, తమిళ్ కన్నడ మలయాళం అందుబాటులో రానుంది. ఇక ఈ చిత్రాన్ని మెర్సిడేస్ బెంచ్ SUV లో చిక్కుకున్న దొంగ చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది ఈ చిత్రాన్ని డైరెక్టర్ సతీష్ త్రిపుర దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో ప్రీతి ఆస్త్రాన్ని హీరోయిన్గా నటించింది.


కాలభైరవ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన చూడలేని ప్రేక్షకులు సైతం ఓ టి టి చూడవచ్చు. అందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. మరి ఓ టీ టి లో అయినా ఈ సినిమా సత్తా చాటుతుందేమో చూడాలి మరి. ఏది ఏమైనా సంగీత దర్శకుడు అయ్యింది కూడా పలు సినిమాలను నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారంటే అది ఒక విశేషమని చెప్పవచ్చు. మరి తన తదుపరి చిత్రాలతో విజయాలను అందుకుంటాడేమో శ్రీ సింహ చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: