మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎంతో మంది దర్శకులతో రెండు మూడు సినిమాలలో నటించి బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి . అలాంటి వారిలో వివి వినాయక్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి , వి వి వినాయక్ కాంబినేషన్ లో మొదటగా ఠాగూర్ మూవీ తెరకెక్కింది . ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్ విజయం సాధించినటువంటి రమణ మూవీ కి రీమేక్ గా రూపొందింది. తెలుగులో ఠాగూర్ పేరుతో విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను కూడా రాబట్టింది .

మూవీ ద్వారా వి వి వినాయక్ లు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత చిరంజీవి , వి వి వినాయక్ కాంబినేషన్ లో ఖైదీ నెంబర్ 150 మూవీ తెరకెక్కింది.  చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ మూవీ తో సినిమా ఇండస్ట్రీలోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఈ సినిమాతో కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తమిళంలో రూపొందిన కత్తి మూవీ కి అఫీషియల్ రీమేగా తెరకెక్కింది.

ఇలా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో రెండు మూవీ లు రూపొంది ... రెండు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో రీమిక్ మూవీ రాబోతుంది అంటూ కొన్ని వార్తలు తాజాగా బయటకు వచ్చాయి. తమిళంలో సూపర్ హిట్ విజయం అందుకున్నటువంటి విశ్వాసం సినిమాను వి వి వినాయక్ , చిరంజీవి తో రీమేక్ చేయబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. కాకపోతే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: