ఇటీవల కాలంలో విడుదలవుతోన్న సినిమాలలో హీరోయిన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉండటం లేదు అనే మాటలు ఎక్కువగా నే వినిపిస్తున్నాయి. ఎంతపెద్ద స్టార్ హీరో అయినా కూడా హీరోయిన్స్ కేవలం రెండు మూడు సీన్స్ కు, పాటలకు మాత్రమే పరిమితం అవుతున్నారు.

బడా హీరోల అంటే ఆ హీరోనే చూస్తారు ని ప్రేక్షకులు.. దర్శకులు కూడా ఆ స్టార్ హీరోనే దృష్టిలో పెట్టుకొని అయితే తీస్తుంటారు. హీరోయిన్ ఉందంటే ఉంది అంతే .. అలా స్టోరీ ని రాసుకుంటూ ఉంటారు కొందరు డైరెక్టర్స్. ఇదే పరిస్థితి ఇటీవల ఓ సినిమా లో కూడా జరిగింది. హీరోయిన్ కు పెద్దగా పాత్ర లేకపోవడంతో ఆమె అభిమానులు బాగా నిరాశపడ్డారు. మా హీరోయిన్ ను ఎక్కువ సేపు చూపించలేదు అని కూడా ఫీల్ అయ్యారట.. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆమె రష్మిక మందన్న.

ఇటీవల విడుదలైన సినిమాలలో దళపతి విజయ్ వారసుడు కూడా ఒకటి. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడి పల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల అయ్యింది.

తమిళ్ లో హిట్ టాక్ వచ్చినా తెలుగులో మాత్రం మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. ఇప్పుడు కలెక్షన్స్ బాగానే రాబడుతోంది. అయితే ఈ సినిమా లో రష్మిక పాత్ర చాలా తక్కువ సమయం ఉంటుందట. కేవలం రెండు మూడు సన్నివేశాలకు మాత్రమే పరిమితం చేశారు. అలాగే రెండు పాటల్లో కూడా కనిపిస్తుంది అంతే.. తాజాగా దీని పై రష్మిక స్పందించింది. రష్మిక నటించిన మిషన్ మజ్ను ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక దళపతి విజయ్ గురించి మాట్లాడింది. దళపతి విజయ్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఈ సినిమా లో నటించడమే అదృష్టంగా భావిస్తున్నా అని తెలిపింది. వారసుడు లో నేను చేసింది అయితే ఏమీ లేదు.. అది నాకు కూడా తెలుసు. కానీ విజయ్ సార్ తో కలిసి నటించాను .. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా.. నేను వారసుడు చేసిందని చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నా అని తెలిపింది..

మరింత సమాచారం తెలుసుకోండి: