ఎప్పటికి మర్చిపోని నటుడుగా ఉదయ్ కిరణ్  తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాడు
ఆయన ఈ లోకానికి దూరమై చాలా ఏళ్ళు అయినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆయనను ఇప్పటికీ కూడా మరువలేక పోతున్నారు. ఎందుకంటే ఉదయ్ కిరణ్ తెలుగు ప్రేక్షకులతో అంత మంచి అభిమానం ను సంపాదించుకున్నాడు కాబట్టి.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు ఉదయ్ కిరణ్. ఎక్కువగా ప్రేమ కథలలోనే నటించాడు. అంతేకాకుండా లవర్ బాయ్  గా కూడా నిలిచాడు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన సొంత టాలెంట్ తో స్టార్ హీరో హోదాను కూడా అందుకున్నాడు. ఎంతోమంది అభిమానుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు.

చిత్రం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవ్వగా ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సినిమాలలో తన నటనకు మంచి గుర్తింపు ను తెచ్చుకొని ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకున్నాడు. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అలా కొన్ని సినిమాలలో నటించిన తర్వాత ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడటా.అవకాశాలు కూడా అంతగా అందుకోలేకపోయాడని తెలుస్తుంది.వాటిని తట్టుకోలేక 2014లో ఆత్మహత్య చేసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు.. అయితే ఈయనకు ఈ పరిస్థితి రావడానికి కారణం చిరంజీవి ఫ్యామిలీ అని గతంలో జోరుగా వార్తలు కూడా వచ్చాయి. కానీ ఏ రోజు కూడా చిరంజీవి ఫ్యామిలీ ఈ విషయం గురించి అస్సలు స్పందించలేదు.

ఆయన ఆర్థికంగా ఇబ్బందుల ను ఎదుర్కున్నాడు.. ఆయనకు అవకాశాలు ఇవ్వలేదు అని  అంటున్నారు కానీ.. అసలు ఆయనకు ఎందుకు అవకాశాలు రాలేవు.. ఎవరి వల్ల అలా అయ్యాడు అనే విషయం చూస్తే చిరంజీవి ఫ్యామిలీ అని అంటున్నారటా.అదేంటంటే ఉదయ్ కిరణ్ మంచి హోదాలో ఉన్న సమయంలో చిరంజీవి తన కూతురు సుష్మితను  ఉదయ్ కిరణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడని కానీ అది కుదరలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: