చిత్రం, జయం, నువ్వు నేను.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో డైరెక్టర్ తేజ ప్రేక్షకులని మెప్పించాడు. అసిస్టెంట్ కెమెరామెన్ గా కెరీర్ మొదలుపెట్టి సినిమాటోగ్రాఫర్ గా చాలా సూపర్ హిట్ సినిమాలకు పనిచేసి చిత్రం సినిమాతో దర్శకుడిగా మారారు.కెరీర్ మొదట్నుంచి కూడా కొత్త వాళ్ళతో, చిన్న హీరోలతో సినిమాలు తీస్తూ సక్సెస్ లు కొట్టాడు. మధ్యలో కొన్ని సినిమాలు పరాజయం పాలవడంతో ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు.ప్రస్తుతం తేజ రానాతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక తన సినిమాలతోనే కాక తన గురువు ఆర్జీవిలాగా మాట్లాడే మాటలతో కూడా వైరల్ అవుతూ ఉంటాడు తేజ. గతంలో పలు ఇంటర్వ్యూలతో వైరల్ అయ్యాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తేజ ఆసక్తికర విషయాలని తెలియచేసారు. సాధారణంగా గతంలో సినిమాల్లో షూట్ మొదలుపెట్టేముందు క్లాప్ బోర్డు కొడతారు. గతంలో చెక్క బోర్డులు వాడి, దానిపై చాక్ పేస్ తో సీన్ నెంబర్, డేట్, షాట్ నంబర్, సీన్ టైమింగ్.. ఇలా పలు విషయాలు రాస్తారు. ప్రస్తుతం మాత్రం ఆ చెక్క బోర్డులు, చాక్ పీస్ లు పోయి అక్రెలిక్ బోర్డ్స్, మార్కర్స్ వచ్చాయి. అవి మొదలుపెట్టింది నేనే అని తేజ తెలిపాడు.ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ.. గతంలో నేను కెమెరామెన్ గా ఉన్నప్పుడు చెక్క బోర్డు మీద చాక్ పీస్ తో రాసి క్లాప్ కొట్టేవాళ్ళు దాని వల్ల ఆర్టిస్ట్ ఫేస్ ముందు ఆ చాక్ పౌడర్ లైట్ గా కనిపించేది. అందుకే నేను దర్శకుడిగా మారాక మొదటి సినిమా చిత్రంకు ఆక్రలిక్ బోర్డు తయారు చేయించాను. దానిపై మార్కర్ తో రాసి క్లాప్ కొట్టించేవాడిని. దాని వల్ల ఆ డస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. సినీ పరిశ్రమలో నేనే అది మొదటిసారి వాడాను. ఆ తర్వాత అందరూ అవే వాడారు. కృష్ణ నగర్ లో ఒకడికి ఆ అక్రలిక్ బోర్డ్స్ చేయడం నేనే నేర్పించాను అని తెలిపారు.అలాగే తెలుగు సినీ పరిశ్రమలో సినిమా మొత్తం డిజిటల్ లో మొదటిసారి చేసింది నేనే. నీకు నాకు డాష్ డాష్ సినిమాని మొదటిసారి రెడ్ కెమెరా వాడి రీల్స్ లేకుండా మొత్తం డిజిటల్ లోనే తీశాను. ఇప్పుడు అందరూ డిజిటల్ లోనే సినిమాలు తీస్తున్నారు. ఇలా సినీ పరిశ్రమలో చాలా కొత్తవి తీసుకొచ్చాను అని తెలిపారు. ఇంత ట్యాలెంటెడ్, ఒకప్పుడు స్టార్ డైరెక్టర్, ఇప్పుడేమో హిట్స్ లేక, మంచి సినిమాలు తీయక ఇలా ఉన్నాడు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: