స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “టిల్లు స్క్వేర్”.. బ్లాక్ బస్టర్ మూవీ 'డీజే టిల్లు'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా మార్చి 29న రిలీజై అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటుంది.. కలెక్షన్స్ పరంగా కూడా ఈ మూవీ దూసుకెళ్తుంది.అయితే, మూవీ విడుదలకంటే ముందు ప్రమోషన్స్‌లో పాల్గొన్న హీరో సిద్ధు జొన్నలగడ్డ టిల్లు పార్ట్ 3పై కూడా క్లారిటీని ఇచ్చేశాడు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.డీజే టిల్లు మూవీ చేసే సమయంలో ప్రేక్షకుల్లో అస్సలు అంచనాల్లేవు. హీరో పాత్ర ఎలా ఉంటుంది అనేది వారికీ తెలీదు. అందుకే ఆ పాత్రను చూసి ప్రేక్షకులు ఎంతో సర్‌ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు అదే పాత్రతో మరోసారి మ్యాజిక్ చేయాల్సి రావడంతో కాస్త ఒత్తిడి ఉంటుంది. కానీ ఒత్తిడిని జయించి మెరుగైన అవుట్‌పుట్ ని అందించడానికి మా టీం ఎంతగానో కృషి చేసింది.

సినిమాలో హీరో పాత్ర కొనసాగింపు పూర్తి స్థాయిలో ఉంటుంది. కథ కొనసాగింపు కూడా కొంత ఉంటుంది కానీ.. అది పాత కథను గుర్తుచేస్తూ నూతన అనుభూతిని ఇస్తుంది. టిల్లు పాత్ర కూడా సీక్వెల్‌లో ఇంకా ఎక్కువ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు.మూవీలో చాలా సర్‌ప్రైజ్ లు, షాక్‌లు ఉంటాయి. సినిమా అంతా నవ్వుకుంటూనే ఉంటారు. టిల్లు ఎక్కడా నవ్వడు.. కానీ అందరినీ ఫుల్‌గా నవ్విస్తాడు అని తెలియజేశాడు.. డీజే టిల్లు సీక్వెల్ చేద్దాం అనుకున్న సమయంలో విమల్ వేరే మూవీ కమిట్అయి ఉండటంతో మాకు అందుబాటులో లేరు. మరోవైపు నేను, మల్లిక్ ఒక సినిమా చేద్దామని అప్పటికే అనుకుంటున్నాము. మా కలయికలో డీజే టిల్లు సీక్వెల్ చేస్తే బాగుంటుంది అనిపించి.. అలా మల్లిక్‌ను దర్శకుడిగా తీసుకోవడం జరిగిందని సిద్దూ తెలిపారు.టిల్లు సీక్వెల్ అనుకున్నప్పుడు లక్కీగా మాకు మంచి కథ తట్టింది. పార్ట్-3 కి కూడా అలాగే జరుగుతుందేమో చూడాలి. ప్రస్తుతం మాకు రెండు మూడు ఐడియాస్ ఉన్నాయి.అయితే టిల్లు-3 కంటే ముందుగా మరో విభిన్న కథ రాసే ఆలోచనలోనేను ఉన్నానని సిద్దూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: