ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అరుదైన కాంబినేషన్స్ సెట్ అవుతుంటాయి. మొదటి కాంబోలోనే సూపర్ హిట్ ఇచ్చి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపుతుంటారు. తమ కాంబోతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతారు.తాజాగా మరోసారి టాలీవుడ్ లో కాంబో రిపీట్ కాబోతోంది. అదే ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్. ‘అరవింద సమేత’ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య మంచి అనుబంధం ఏర్పడిందని, ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తర్వాత మళ్లీ కలిసి పనిచేయాలని అనుకున్నారు. అయితే డేట్లు సర్దుబాటు కాకపోవడం, సరైన కథ పడకపోవడంతో కార్యరూపం దాల్చలేదు.

అయితే కొరటాల శివతో ‘దేవర’కు ఎన్టీఆర్, మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’కు త్రివిక్రమ్ సంతకాలు చేయడం కాంబో రిపీట్ కాేలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఓ సెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ జూనియర్ కు వీరాభిమాని అయిన నాగవంశీ ఈ కాంబో ను సెట్ చేసే అవకాశాలున్నాయి. సోమవారం జరిగిన ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ సెలబ్రేషన్స్ ఎన్టీఆర్ హింట్ ఇచ్చారు. ఇక నాగవంశీ లన్నింటిలో భాగస్వామిగా ఉన్న త్రివిక్రమ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ ని రిపీట్ చేసే ప్రయత్నంలో నాగవంశీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ సెలబ్రేషన్స్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అంటే పిచ్చి ఉన్న సిద్ధు లాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. తన ల్లోని పాత్రలకు న్యాయం చేయడంపై దృష్టి పెట్టాడు. జీవితాంతం మనతోనే ఉండే ఐకానిక్ క్యారెక్టర్ టిల్లు. టిల్లుగా సిద్ధు నటన నన్ను చాలాసార్లు నవ్వించింది. సిద్ధూకు, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ వెనుక ఉన్న టీమ్ అందరికీ హ్యాట్సాఫ్” అన్నారు ఎన్టీఆర్. యువ కథానాయకుడు విశ్వక్ సేన్ గురించి కూడా మాట్లాడుతూ “తెలుగు లో కొత్త వేవ్ సృష్టించడానికి డేర్ డెవిల్స్ సిద్ధు, విశ్వక్ సేన్ ఇద్దరినీ నేను నమ్ముతున్నా అని అన్నారు. టిల్లు స్క్వేర్ రూ.100 కోట్ల మైలురాయిని అధిగమించి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగవంశీ ‘సీత’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: