ప్రభాస్ వరుసగా పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా సలార్ సినిమాతో యావరేజ్ హిట్టు కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ సినిమా చేస్తున్నాడు.ప్రభాస్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ రోల్ లో ప్రభాస్  ఈ సినిమాలో కనిపిస్తారని తన దగ్గర వ్యక్తి విషయంలో తప్పు జరిగితే ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని సందీప్ రీసెంట్ గా చెప్పారు. 60 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తైందని మిగతా 40 శాతం స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తానని సందీప్ కామెంట్లు చేశారు. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. మొదట ప్రభాస్ ఒక హాలీవుడ్ సినిమాని చెయ్యాలని అడగగా.. సందీప్ స్పిరిట్ లైన్ చెప్పాడట. అది బాగా నచ్చడంతో ప్రభాస్ ఓకే చేశాడట.


300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నామని సందీప్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్లు ఓపెనింగ్స్ 150 కోట్ల రూపాయలు వచ్చేస్తాయని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. ప్రభాస్ సందీప్ కాంబినేషన్ ఇండస్ట్రీని షేక్ చేసే కాంబినేషన్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. స్పిరిట్ సినిమాలో హీరో తనను ఇబ్బంది పెడితే ఏ విధంగా రియాక్ట్ అవుతాడనేది హైలెట్ గా చూపించబోతున్నామని ఆయన చెప్పుకొచ్చారు.స్పిరిట్  మూవీపై తన కామెంట్లతో సందీప్ రెడ్డి వంగా అంచనాలను పెంచేశారు. 2026 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. ప్రభాస్ గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం కల్కి  సినిమాతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అలాగే హను రాగపూడితో హైదరాబాద్ రజాకార్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.ఇలా ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తుండటం ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: