మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా హర్ష దర్శకత్వం లో రూపొందిన బీమా అనే పవర్ఫుల్ యాక్షన్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీలో మాళవిక శర్మ, ప్రియ భవాని శంకర్ హీరోయిన్లుగా నటించారు . ఈ సినిమా మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయ్యింది. చాలా కాలం తర్వాత ఈ మూవీలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడంతో ఈ మూవీపై ఆయన అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ప్రేక్షకులను తీవ్రనిరుత్సాహానికి గురి చేసింది.

దానితో ఈ మూవీ పెద్దగా కలెక్షన్లను వసూలు చేయలేదు . చివరగా ఈ మూవీ యావరేజ్ సినిమాగా మిగిలి పోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ మూవీ గా నిలిచిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది . తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ వారు దక్కించుకున్నారు . అందులో భాగంగా ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

మరి ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి . ఇదిలా ఉంటే బీమా మూవీతో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన గోపీచంద్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. వరుస ఫ్లాప్ లలో ఉన్న గోపీచంద్ , శ్రీను వైట్ల కాంబో లో రూపొందుతున్న సినిమా అయినప్పటికీ ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gc