ఇటీవల కాలం లో సినిమా ఇండస్ట్రీ లో సెలబ్రిటీల విడాకుల వ్యవహారం ఎంతల హాట్ టాపిక్ గా మారి పోతూ ఉందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎన్నో ఏళ్ల పాటు అన్యోన్య దంపతులుగా ఇండస్ట్రీ లో క్యూట్ కపుల్స్ గా పేరు సంపాదించుకున్న వారు.. ఇటీవల కాలం లో మాత్రం ఏకంగా తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఇలా విడాకులు తీసుకుంటున్నాము అంటూ అభిమానులందరికీ షాక్ ఇస్తున్న సెలబ్రిటీలు కాస్త ఎక్కువైపోయారు.


 అయితే ఎవరు ఊహించని విధంగా ఇలా విడాకులకు సిద్ధమైన సెలబ్రిటీ జంటల్లో అటు స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య దంపతులు కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు అన్యోన్య దంపతులుగా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ ఇక దాదాపు 20 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికేందుకు సిద్ధమయ్యారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటన చేయడంతో అందరూ అవాక్కయ్యారు. ఇది నమ్మటానికి కూడా కాస్త సమయం పట్టింది.


 అయితే ఇలా విడాకులు తీసుకొని వేరు పడుతున్నాము అని ఐశ్వర్య, ధనుష్ చెప్పారు. కానీ ఇప్పటివరకు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోలేదట. ఇక ఇప్పుడు ఏకంగా అఫీషియల్ గా విడాకులు తీసుకోబోతున్నారు అనేది తెలుస్తుంది. చెన్నైలోనే ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారట ఐశ్వర్య, ధనుష్. కాగా 2022లో జనవరిలోనే విడాకులు తీసుకుంటున్న ప్రకటించినప్పటికీ తర్వాత వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ విడాకులకు సంబంధించిన దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఐశ్వర్య సూపర్స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె  ఇక ధనుష్, ఐశ్వర్య కు 2004లో వివాహం జరగగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: