మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే విడాకుల తర్వాత తన కెరియర్ పై పూర్తి ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. పెళ్లితో సినిమాలకి దూరమైన ఈమె ఇటీవల హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నిహారిక వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికి తమిళ్ లో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాతో పాటు మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న వాట్ ది ఫిష్ సినిమాలో సైతం ఒక కీలక పాత్రలో నటిస్తోంది నిహారిక. దాంతోపాటు యాంకర్ గా కూడా మళ్లీ తన కెరియర్ను ప్రారంభించింది.

దాంతోపాటు ఓటిటి లో సైతం చెఫ్ మంత్రా పేరుతో స్ట్రీమింగ్ అవుతున్న షో కి హోస్ట్ గా వ్యవహరిస్తోంది నిహారిక. దాంతో పాటు నిర్మాతగా కూడా పలు వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ లో నిర్మిస్తూ బిజీగా ఉంది. విడాకుల తర్వాత తన పూర్తి ఫోకస్ను సినిమా నిర్మాణం పై పెట్టి దూసుకుపోతోంది నిహారిక. అయితే తాజాగా నిహారిక తన బ్యానర్లో వస్తున్న చిత్ర విశేషాలను సైతం పంచుకుంటూ ఉంటుంది. అలాగే దానికి ఒక క్రేజీ టైటిల్ సైతం ఫిక్స్ చేశారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ శ్రీ రాధా దామోదర్ బ్యానర్ పై కమిటీ కుర్రాళ్ళు పేరుతో ఒక సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది.

అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ను సుప్రీం హీరో సాయి ధరం తేజ్ విడుదల చేశారు. టైటిల్ గ్లిమ్స్ చూస్తుంటే .. ఇది గోదావరి పల్లెటూరి కాలేజీ కుర్రాళ్ళ కథ అని తెలుస్తుంది. ఈ సందర్భంగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. ” మరి హారతి పల్లాలు, దండలు గట్రా దగ్గరెట్టుకోండమ్మా. మన కమిటీ కుర్రాళ్ళు బయలుదేరి పోయారు” అని రాసుకొచ్చింది. అయితే ఈ సినిమాలో అంతా కొత్తవాళ్లే నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ద్వారా పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.  అందులో కొంతమంది యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. న్యూ కమర్స్ తో సినిమా చేయడం పెద్ద బాధ్యత అని నిహారిక తెలిపింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: