ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల కంటే ఎక్కువ గుర్తింపును తెచ్చుకుంది ఎవరన్నా ఉన్నారు అంటే అది ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. స్టార్ సెలబ్రిటీల జీవితాలకి సంబంధించిన వార్తలను చాలా ఓపెన్గా బయట పెడుతూ కాంట్రవర్సీలకి గురవుతూ ఉంటాడు. ప్రభాస్ రష్మిక మందన సమంత నాగచైతన్య వంటి స్టార్ సెలబ్రిటీల జీవితాలను మలుపు తిప్పాడు ఈ వేణు స్వామి. అయితే ఇటీవల ఆయన లేడీ సూపర్ స్టార్ నయనతార పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సౌత్ సిని ఇండస్ట్రీలోని నంబర్ వన్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక నయనతార కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలం డేటింగ్ చేసిన ఈ జంట ఆ తర్వాత పెళ్లి బంధం తో ఒకటయ్యారు. ఆ తర్వాత కనీసం ఐదు నెలలు కూడా తిరగకుండానే సరోగశి  పద్ధతి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. అయితే అప్పట్లో ఈ విషయం ఎంతటి సెన్సేషన్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే నయనతార పెళ్లి అయి సంవత్సరం తిరగకుండానే ఎందుకు ఇంత సడన్గా పిల్లలను ప్లాన్ చేసుకుంది.. అది కూడా సరోగసి పద్ధతి ద్వారా ఎందుకు పిల్లలకి తల్లి అయింది అన్న విషయంపై పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి .కానీ ఇప్పటివరకు అసలు నిజం ఏంటి అన్నది మాత్రం బయటికి రాలేదు.. అయితే నయనతార అంత సడన్గా పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం వెనుక కారణం ఇదే అంతూ సంచలన విషయాని బయటపెట్టాడు వేణు స్వామి . 'నయనతారకు సంతాన యోగమే లేదని ..ఆ భయం కారణంగానే సరోగసి ద్వారా త్వరగా పిల్లలను ప్లాన్ చేసుకుంది అని ..మీరు అనుకుంటున్న మరి ఏ చెత్త రీజన్ లేదు 'అంటూ బయట పెట్టేసాడు వేణు స్వామి ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: