మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు లైన్లో పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఒకవైపు చేతినిండా సినిమాలు చేస్తూ మరొకవైపు కొత్త డైరెక్టర్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. అయితే తాజాగా ఉగాది సందర్భంగా తన కొత్త సినిమాను సైతం ప్రకటించాడు రవితేజ. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలి అని రవితేజ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో వచ్చిన మాస్ యాక్షన్ జానర్ లో కాకుండా ఈసారి తన మార్గ కామెడీ జానర్ లో ఈ సినిమాని చూపించాలి అని రవితేజ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

 ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  రవన్న ఈసారి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలోని రవితేజ కి సామజ వర గమన కథ రచయిత భాను భోగవరపు వినిపించిన కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో రవితేజ పాత్ర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినబడుతున్నాయి.

అయితే ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు లక్ష్మణ్భేరి అని తాజాగా విడుదల చేసిన పోస్టర్లో పేర్కొన్నారు. అలాగే ఆ పేరు కింద ఉగాది నాడు రాసి ఫలాల డీటెయిల్స్ ఇవ్వగా, అందులో ఆదాయం చెప్పన్ అని, వ్యయం లెక్క చెయ్యన్ అని, అవమానం జీరో అని, రాజపూజ్యం అన్లిమిటెడ్ అని ఉంది.. అంటే ఈ సినిమాలో నిరుద్యోగిగా కనిపించబోతున్నారని తెలుస్తుంది.. వెంకీ సినిమాలోలాగా ఈ సినిమాలో కనిపించునున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే వరకు వెయిట్ చెయ్యాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: