ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమాలలో "పుష్ప పార్ట్ 2" మూవీ ఒకటి. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా... ఈ భారీ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. "పుష్ప పార్ట్ 1" మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకోవడం... ఈ సినిమాలోని అల్లు అర్జున్ నటనకు నేషనల్ అవార్డు కూడా దక్కడంతో "పుష్ప పార్ట్ 2" మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీని మైత్రి మూవీ సంస్థ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ కేజీ న్యూస్ వైరల్ అవుతుంది. 

మూవీ యొక్క నైజాం ఏరియా థియేటర్ హక్కులకు మైత్రి సంస్థ దాదాపు 100 కోట్ల వరకు డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు ... ఒక వేళ ఈ సంస్థ వారు ఈ సినిమాను నైజాం ఏరియాలో సొంతగా విడుదల చేసుకున్న 100 కోట్ల రేంజ్ బిజినెస్ తోనే ఈ మూవీని నైజాం ఏరియా లో ప్రమోట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఈ సినిమాను 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో నైజాం ఏరియాలో విడుదల చేసినట్లు అయితే ఈ ఏరియాలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే దాదాపుగా 110 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మరీ చిన్న విషయం ఏమీ కాదు. కాకపోతే "పుష్ప పార్ట్ 2" మూవీ పై ఉన్న అంచనాలను గనక ఈ సినిమా అందుకున్నట్లు అయితే అవలీలగా ఈ సినిమా 110 కోట్ల షేర్ కలెక్షన్లను నైజాం ఏరియాలో రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa