పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే మూవీ ని స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించిన తర్వాత పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" సినిమాను కూడా ప్రారంభించడంతో ఆ సినిమా పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. దానితో కలిగా ఉండడం ఎందుకు అని క్రిష్ కూడా ఆ గ్యాప్ లో కొండపొలం అనే మూవీ ని రూపొందించాడు. 

అలా వీరిద్దరూ కూడా హరిహర వీరమల్లు మూవీ ని పక్కన పెట్టేసి ఇతర మూవీ లను పూర్తి చేశారు. ఇక భీమ్లా నాయక్ , కొండపొలం సినిమాల పనులు పూర్తి కాగానే హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ మరికొన్ని సినిమాలను మొదలు పెట్టడం అలాగే రాజకీయ పనులతో బిజీగా మారడంతో మళ్లీ ఈ సినిమా సైడ్ అయిపోయింది.

దానితో ఈ మూవీ పూర్తి కాదు అని అనేక వార్తలు వచ్చాయి. దానితో ఈ మూవీ నిర్మాత రత్నం కచ్చితంగా ఈ సినిమాని పూర్తి చేసి విడుదల చేస్తాం. ఇది ఒక గొప్ప సినిమా. ఈ సినిమాను పూర్తి చేయడానికి టైం ఎక్కువగా పడుతుంది. అందుకే ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతుంది అని ఈయన క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ "మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం" అంటూ తెలియజేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకే ఈ పోస్టర్ ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నీది అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: