టాలీవుడ్ హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన డైరెక్షన్లో పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పైన భారీగానే అభిమానులకు అంచనాలున్నాయి.. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా నైట్ షెడ్యూల్లో కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. నైట్ బ్యాడ్ గ్రాఫ్ లో వస్తున్న కొన్ని యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. గ్లింప్స్ రిలీజ్ చేయగా ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి.


పెద్ది సినిమా షూటింగ్ ఎక్కువగా నైట్ సిన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా భారీ యాక్షన్ సీన్స్ సంబంధించి రామ్ చరణ్ పైన ఒక షూట్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా ఉంటుందని చిత్ర బృందం భావిస్తోందట. ఈ షూటింగ్ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక షెడ్యూల్ ఉండబోతున్నట్లు సమాచారం. వచ్చే నెల జూలై రెండవ వారం నుంచి ఇక్కడ షూటింగ్ మొదలు పెట్టబోతున్నదట. రామ్ చరణ్, జాన్వీ కపూర్ సిన్స్ ఉండే అవకాశం ఉన్నదట. ఆ తర్వాత ఆమని, జగపతిబాబు మధ్య కొన్ని సన్నివేశాలు ఉంటాయని సమాచారం.


పెద్ది సినిమాలో ప్రేమ, ఆత్మగౌరవం నేపథ్యంలో ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో చాలా ఎమోషనల్ సన్నివేశాలకు పెద్దపీట వేయబోతున్నారని డైరెక్టర్ బుచ్చిబాబు తెలిపారు. రంగస్థలం సినిమాకి మించి మరి పెద్ది సినిమా ఉంటుందని ఇప్పటికే రామ్ చరణ్ అభిమానులు భావిస్తున్నారు. రామ్ చరణ్ సినిమా సక్సెస్ కోసం అడుగుచి బాబు సనా కూడా నైట్ షెడ్యూల్ లో ఎక్కువగా పనిచేస్తున్నారట రామ్ చరణ్ కూడా అందుకు సహకరిస్తూ ఉండడంతో సినిమా షూటింగ్ నీ శర వేగంగా పూర్తి చేస్తున్నారు. మరి ఎలాంటి బ్లాక్ బాస్టర్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: