
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కి ముందు టాలీవుడ్ లో ఆ నలుగురు పై చర్చ జోరుగా సాగింది. పరిశ్రమను తమ గుప్పెట్లో పెట్టుకున్నారని తెరవెనక ఇండస్ట్రీని శాసిస్తున్నారు అంటూ చాలా వివాదాలు చెలరేగాయి. అలా వివాదం మొదలైన వెంటనే అల్లు అరవింద్ - ఏషియన్ సునీల్ - దిల్ రాజు - శిరీష్ రెడ్డి లాంటి వాళ్లు మీడియా ముందుకు వచ్చి స్పందించారు. ఆ నలుగురులో మేము లేము అంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. దీనిపై ప్రముఖ టాలీవుడ్ సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సెటైర్ వేశారు. బయటకు వచ్చి ఎవరైతే మేము లేమని చెప్పారో ఆ నలుగురే వాళ్ళు అంటూ కామెంట్ చేశారు. మేము లేము అన్న నలుగురే ఆ నలుగురు అనేది తమ్మారెడ్డి చెబుతున్న మాట.
ఇండస్ట్రీలో థియేటర్లన్నీ కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని కొద్ది రోజుల కింద చర్చ నడిచింది. దీనిపై అల్లు అరవింద్ రాజు - ఏషియన్ సునీల్ లాంటి వాళ్ళు అప్పట్లో ప్రకటనలు చేశారు. థియేటర్లు తమ చేతిలో లేవు అని చెప్పారు. అయితే ఈ విషయాలను తమ్మారెడ్డి ఖండిస్తున్నారు. ఇండస్ట్రీ ఇప్పటికీ బ్యాడ్ పోజిషన్ లోనే ఉందని .. కోర్టు - బలగం లాంటి చిన్న సినిమాలు అప్పుడప్పుడు హిట్ అవుతున్న థియేటర్ పరిస్థితులలో మార్పు రావాలని అది జరిగినప్పుడు పరిశ్రమ మునగడ కష్టం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు