
తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై ఈ ధర్నా జరిగింది. అయితే అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో మోహన్ బాబుతో పాటు కుమారులు విష్ణు, మనోజ్, మరికొందరిపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల కింద చంద్రగిరి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని మొదట మోహన్ బాబు హైకోర్టును కోరగా.. న్యాయస్థానం అందుకు నిరాకరించింది.
దాంతో ఈ కేసును సవాల్ చేస్తూ మోహన్ బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు దాఖలు చేసిన అభ్యర్థనను సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం వారిపై నమోదు చేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో మోహన్బాబు ఫ్యామిలీకి భారీ ఊరిట లభించినట్లు అయింది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు