
ఈ హీరోయిన్ తో సినిమా చేయాలి అంటూ బాలీవుడ్ స్టార్స్ ..కోలీవుడ్ స్టార్స్ ..కన్నడ స్టార్స్ .. తెలుగు స్టార్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు . రష్మిక ఒక సినిమాకి 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి వెళ్ళిపోయింది . మొదటి సినిమా "చలో" కోసం కేవలం 50000 రెమ్యూనరేషన్ తీసుకున్న రష్మిక.. ఇప్పుడు 10 - 12 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగింది అంటే ఆమెలోని టాలెంట్ ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు . పైగా ఇప్పుడు "మైసా" సినిమాతో మరొక సెన్సేషన్ హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది .
అయితే రష్మిక మందన్న ఇలాంటి సమయంలోనే ఒక స్టార్ హీరో తో కమిట్ అయిన మూవీ ఆమె పేరుని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైయేలా చేస్తుంది. ఆ హీరో మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ "శింబు". శింబు చేయబోయే తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నారట . ఆమె కూడా ఇందుకు ఓకే చేసిందట . శింబుతో సినిమా అంటే హీరోయిన్స్ అందరూ భయపడతారు . ఆయనతో సినిమాలో నటిస్తే హిట్ కన్నా కూడా గాసిప్స్ ఎక్కువగా వస్తాయి .. ఖచ్చితంగా ఆయనతో ప్రేమలో పడిపోతారు ..ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ హీరోతో పాటు ఈ హీరోయిన్ పేరు కూడా గబ్బు లేపుతుంది. చాలామంది హీరోయిన్స్ శింబు ఖాతాలో బలైపోయారు . నయనతార, హన్సిక, నిధి అగర్వాల్ ఇలా ఎంతోమంది హీరోయిన్స్ కెరియర్ లో బిగ్ రూమర్స్ వినిపించడానికి కారణం శింబునే. మరి అలాంటి హీరోతో రష్మిక ఎందుకు సినిమా ఓకే చేసింది ..?? అనేది ఇప్పుడు అందరికీ బిగ్ డౌట్ . దీని గురించే జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . రష్మిక ఫ్యాన్స్ అయితే పోయి పోయి వాడితో సినిమా ఎందుకు..?? క్యాన్సిల్ చేసుకో అంటూ సజెస్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి రష్మిక ఏం చేస్తుందో...??