నందమూరి కుటుంబం అంటే తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం. ఆ కుటుంబానికి చెందిన ప్రతి హీరోకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. విశ్వవిఖ్యాత నవరసనటసార్వభౌముడు నందమూరి తారకరామారావు వారసత్వాన్ని కొనసాగిస్తూ నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానం అత్యున్నత స్థాయిలో కొనసాగుతోంది. 100 పైగా సినిమాల‌తో అగ్రహీరోగా నిలిచిన బాలయ్య బాబు తన యాక్షన్, డైలాగ్ డెలివరీ, మాస్ ఇమేజ్‌తో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వారసుడు మోక్షజ్ఞ బాలకృష్ణ సినీ ఆరంగేట్రం ఎప్పుడో అన్న ప్రశ్నపై అభిమానులు, సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 2018లోనే మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి వార్తలు మొదలయ్యాయి. మొదట ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 లో ఆయన హీరోగా వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. ఆ తరువాత బోయపాటి శ్రీను, మలినేని గోపిచంద్, అనిల్ రావిపూడి వంటి స్టార్ డైరెక్టర్లతో మోక్షజ్ఞ డెబ్యూ ఫిక్స్ అవుతుందన్న టాక్ వచ్చింది. అయితే ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా అధికారికంగా ఫైనల్ కాలేదు. దీంతో అభిమానుల్లో నిరాశ పెరిగింది.


తాజాగా హీరో నారా రోహిత్ ఒక ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మోక్షజ్ఞ డెబ్యూ సినిమా 2025 చివర్లో లేదా 2026 ఆరంభంలో వచ్చే అవకాశం ఉందన్నారు. మోక్షజ్ఞ శారీరకంగా పూర్తిగా మారిపోయాడని, హీరోగా కనిపించే లుక్, స్టామినా ఇప్పుడు ఉన్నాయని రోహిత్ తెలిపారు. ఆయనతో ఇటీవలే మాట్లాడానని, ప్రస్తుతం సరైన కథ కోసం వెతుకుతున్నాడని రోహిత్ చెప్పడం నందమూరి అభిమానులకు ఫుల్ జోష్ ఇచ్చింది. బాలకృష్ణ చిన్న వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టి, త్వరగానే అగ్ర హీరోగా ఎదిగారు. ఆ పంథాలోనే మోక్షజ్ఞ కూడా తన ప్రతిభను నిరూపించుకోవాలని అభిమానుల ఆశ. అయితే నందమూరి కుటుంబం ఇప్పటి వరకు ఏ అధికారిక ప్రకటన చేయకపోవడం ఫ్యాన్స్‌లో కాస్త నిరాశ‌, నిస్పృహ‌లు నెల‌కొన్నాయి.  ఇప్పుడు రోహిత్ క్లారిటీ ఇవ్వ‌డంతో వీరిలో స‌రికొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: