ఇంతటితో ఆగిపోలేదు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ను కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఆ స్పెషల్ సాంగ్లో ఇద్దరు మెగా హీరోలు కలిసి మెరవబోతున్నారని, ఆ సాంగ్ కోసం గ్రాండ్ స్కేల్లో సెట్ వేశారని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్నవారు మాత్రమే కాదు, చాలామందికి సహాయం చేసే మంచి మనసున్న వారు కూడా. ముఖ్యంగా ఈ ఇద్దరితో మెగాస్టార్కు ప్రత్యేకమైన అభిమాన సంబంధం ఉన్నట్టు ఇండస్ట్రీలో అంటుంటారు. మెగాస్టార్ చిరంజీవి వల్లే వాళ్ల కెరియర్ ఈ రేంజ్ కి ఎదిగింది. ఆ ఇద్దరు వ్యక్తులే ఇప్పుడు ఆయన సినిమాకే స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అన్న వార్త బయటకు రాగానే, సోషల్ మీడియాలో ఈ న్యూస్ భారీగా వైరల్ అయింది. ఆ ఇద్దరు మరి ఎవరో కాదు..సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్. అభిమానులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఈ కలయికపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అనిల్ రావిపూడి ఈ మొత్తం ఎపిసోడ్ను ఫుల్ సర్ప్రైజ్గా ప్లాన్ చేశాడనే టాక్ మరింత హైప్ పెంచుతోంది. మొత్తం మీద చిరంజీవి–వెంకటేష్–నాగార్జున లాంటి లెజెండ్స్తో పాటు మెగా హీరోల ప్రెజెన్స్ ఉండటంతో, ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా భారీ క్రేజ్ క్రియేట్ చేస్తుందని ఫిలిమ్ నగర్ టాక్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి