అయితే ఈ తాజా రూమర్స్ పై ధనుష్ కానీ, మృణాల్ ఠాకూర్ కాని ఏ విధమైనటువంటి క్లారిటీ ఇప్పటివరకు ప్రకటించలేదు. ధనుష్ చివరిగా ఇడ్లీ కొట్టు సినిమాలో నటించారు. ఈ సినిమాలో ధనుష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను 2004లో వివాహం చేసుకున్నారు. కొన్ని మనస్పర్ధలు కారణంగా 2024 లో ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. అయితే వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ధనుష్, ఐశ్వర్య విడాకుల వ్యవహారం అటు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో సీతారామం చిత్రంతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. అలా తెలుగులో ఇప్పటికే నాలుగు చిత్రాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హీరో అడవి శేషు తో కలిసి డేకాయిట్ చిత్రంలో కనిపించబోతోంది. మృణాల్ ఠాకూర్ సినిమా ఈవెంట్స్ కు ధనుష్ హాజరు కావడం వల్ల ఈ రూమర్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత ధనుష్ సిస్టర్స్ ని కూడా మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో ఫాలో అవ్వడంతో ప్రేమ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చేలా చేశాయి. మరి ఈ విషయం పైన మరొకసారి ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి. మొత్తానికి ధనుష్, మృణాల్ పెళ్లి విషయం ఇండస్ట్రీలో సంచలనం గా మారింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి