ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక వెల్కమ్ నోట్ విడుదల చేసింది. అందులో “అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించే నయనతార మా ప్రాజెక్టులో భాగమవడం చాలా ఆనందంగా ఉంది. సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ ప్రత్యేక చిత్రంలో ఆమెకు హృదయపూర్వక స్వాగతం” అని పేర్కొన్నారు. ఈ ప్రకటనతోనే సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా, ఈ సినిమా కోసం నయనతార భారీగా పారితోషికం తీసుకుంటున్నట్లు సినీ పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. సుమారు 18 కోట్ల రూపాయల వరకు ఆమె రెమ్యూనరేషన్గా అందుకుంటున్నారని సమాచారం. ఇది నిజమైతే, ఆమె కెరీర్లోనే ఇది ఒక భారీ డీల్గా నిలిచే అవకాశం ఉంది.
మొత్తానికి స్టార్ క్యాస్టింగ్, భారీ బడ్జెట్, ప్రతిభావంతులైన టెక్నీషియన్స్ అన్ని కలిసి ఈ ప్రాజెక్ట్ను పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్గా నిలిపేలా కనిపిస్తున్నాయి. ఇక సినిమా కథ, విడుదల తేదీ వంటి మరిన్ని వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి