స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రాకా. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తోంది. ఆమె బర్తడే సందర్భంగా చిన్న గ్లింప్స్ విడుదల చేయగా అందరిని ఆకట్టుకుంది. ఈమె కాకుండా మరి కొంతమంది హీరోయిన్స్ కూడా ఇందులో నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటువంటి సందర్భంలోనే దీపికా పదుకొనే రెండవసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని, అందుకే ఆమె స్థానంలో మరో హీరోయిన్ తీసుకోబోతున్నట్లు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పలు రకాల రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.


అయితే ఈ రూమర్స్ పైన రాకా టీమ్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. రాకా సినిమా నుంచి దీపికా తప్పుకుందనే వార్తలలో ఎలాంటి నిజం లేదని ఈ సినిమాలో ఆమె పాత్రే చాలా కీలకమని, స్క్రీన్ స్పేస్ తగ్గించారనే ప్రచారంలో కూడా ఎటువంటి వాస్తవం లేదంటు తేల్చి చెప్పింది టీమ్. షూటింగ్ అంతా కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ముందుకు సాగుతుందని ఎవరు కూడా అనవసరమైన రూమర్స్ నమ్మవద్దు అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తున్నారు.


సినిమా షూటింగ్ కోసం అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని యాక్షన్ సీక్వెన్స్ లను కూడా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇక ఈ సినిమాలో దీపికా  తో పాటు రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ నటించబోతున్నట్లు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరందరూ అతిథి పాత్రలో కనిపిస్తారా? లేక పూర్తిస్థాయిలో పాత్రల్లో కనిపిస్తారా అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రాకా సినిమా కోసం అల్లు అర్జున్ మేకప్ కోసమే సుమారుగా 3 నుంచి 4 గంటల పాటు సమయం పడుతోందట, అంతేకాకుండా ప్రయాణం కూడా ప్రతిరోజు చేయడం ఇబ్బందిగా మారడంతో అల్లు అర్జున్ ముంబైకి షిఫ్ట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: